ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తిరుపతికి విద్యుత్ వాహనాల ఛార్జింగ్ స్టేషన్ల మంజూరు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Apr 13, 2022, 01:14 PM

తిరుపతి పట్టణంలో ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్ నెలకొల్పేందుకు ప్రక్రియ వేగవంతం చేయాలని, తిరుపతి పట్టణాన్ని సంవత్సరానికి 5. 8 కోట్ల మంది సందర్శిస్తున్నారని అలాంటి తిరుపతిలో ఒక్క పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్ లేదని ఎంపీ మద్దిల గురుమూర్తి గతంలో పార్లమెంట్ జీరో హావర్లో సమస్యను లేవనెత్తిన విషయం విదితమే.


అందుకు కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల శాఖామాత్యులు నితిన్ గడ్కరి సత్వరమే స్పందించి తిరుపతి పట్టణానికి ఫేమ్-2 స్కీం కింద మొత్తం 68 ఛార్జింగ్ స్టేషన్స్ మంజూరు చేయడం జరిగింది. దేశం మొత్తం మీద విద్యుత్ వాహనాల్ని వినియోగంలోకి తెచ్చేందుకు ప్రోత్సహించేందుకు వినియోగదారులకి సరసమైన ధరకి ఛార్జింగ్ అందుబాటులో ఉండే విధంగా పబ్లిక్ విద్యుత్ ఛార్జింగ్ వ్యవస్థను సృష్టించడం అత్యవసరమని కేంద్ర ప్రభుత్వం 2030 నాటికి 30% విద్యుత్ వాహనాల విక్రయాలలో వృద్ధి లక్ష్యంగ పెట్టుకుంది.


అందుకు తగిన విధంగా వాహన ఛార్జింగ్ వ్యవస్థని భలోపేతం చేస్తామని ఫేమ్ -2 స్కీం కింద దేశం మొత్తంలో 2, 877 పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్‌లు మంజూరు కాగా అందులో తిరుపతి పట్టణానికి 68 ఛార్జింగ్ స్టేషన్‌లు మంజూరయ్యాయని వీటిని నాలుగు ఏజెన్సీలకి ఇచ్చామని తెలియజేసారు. అందులో తిరుపతి స్మార్ట్ సిటీ కార్పొరేషన్ 18, రాజస్థాన్ ఎలక్ట్రానిక్స్ & ఇన్స్ట్రుమెంట్స్ లిమిటెడ్ (ఆర్. ఈ. ఐ. ఎల్) – 10, ఆంధ్ర ప్రదేశ్ నెడ్క్యాప్ లిమిటెడ్ - 20, ఎన్టీపీసీ -20 ఛార్జింగ్ స్టేషన్స్ కేటాయించామని తెలియజేసారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa