ఏపీ సీఎం జగన్ విద్యాశాఖపై బుధవారం తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. నాడు-నేడు రెండో దశ వేగం పెరగాలని, శరవేగంగా పనులు పూర్తి చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. రెండో దశ కింద దాదాపు 25 వేల స్కూళ్లలో పనులు చేపడుతున్నామని చెప్పారు. రెండో దశ నాడు-నేడు పనుల ద్వారా స్కూళ్లలో గణనీయంగా మార్పులు ఈ ఏడాది కనిపించాలని అన్నారు. ప్రభుత్వ వసతి గృహాల్లో కూడా నాడు-నేడు కింద పనులు చేపట్టాలని సీఎం ఆదేశించారు.
నాడు-నేడు రెండోదశ ఖర్చు అంచనా రూ.11,267 కోట్లు అని సీఎం జగన్ తెలిపారు. ఈ విద్యాసంవత్సరంలో 8వ తరగతి ఇంగ్లిషు మాధ్యమంలోకి మార్పు చేయనున్నట్లు తెలిపారు. నాడు-నేడు కింద 468 జూనియర్ కళాశాలల్లో పనులు చేపట్టాలని, ప్రతి మండలానికీ 2 జూనియర్ కాలేజీలు ఉండేలా చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ ఆదేశించారు. వీటిలో అమ్మాయిలకోసం ప్రత్యేకించి ఒక కాలేజీ ఏర్పాటు కావాలని అన్నారు.
జగనన్న విద్యాకానుకను స్కూళ్లు తెరిచే నాటికి అందించేలా చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు సీఎం కి తెలిపారు. విద్యాకానుకకు దాదాపుగా రూ.960 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఈ జులై నుంచి మొదటి విడతలో మ్యాపింగ్ చేసిన స్కూళ్లు ప్రారంభం కానుండగా, తగినన్ని తరగతి గదులు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. 2022 జులై, 2023 జులై, 2024 జులై ఇలా దశలవారీగా ఈ 6 కేటగిరీల స్కూళ్లు ఏర్పాటు కావాలని సీఎం జగన్ అన్నారు. దశలవారీగా ఏర్పాటవుతున్న స్కూళ్లకు అనుగుణంగా సబ్జెక్టుల వారీగా టీచర్లను పెట్టే కార్యక్రమం కూడా చేపట్టాలని సీఎం ఆదేశించారు. ప్రతి హైస్కూల్, హైస్కూల్ ప్లస్ స్కూళ్లన్నీ కూడా సీబీఎస్ఈ అఫిలియేషన్ తో ఉండాలని, ఆ దిశగా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు.
ఇంగ్లీష్ పదాల ఉచ్ఛారణపై యాప్ను టీచర్లకు, విద్యార్థులకు అందుబాటులో ఉంచాలన్నారు. జగనన్న గోరుముద్ద, సంపూర్ణ పోషణలపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని అధికారులకు సీఎం ఆదేశించారు. నిర్దేశించిన మెనూ మేరకు పిల్లలకు ఆహారం అందుతుందా?లేదా? అన్నదానిపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని సీఎం జగన్ అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa