ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీలో అంబేద్కర్ రాజ్యాంగం అమలు కావడం లేదు: రామ్మోహన్‌ నాయుడు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Apr 14, 2022, 02:21 PM

జగన్ ప్రభుత్వంపై తెలుగుదేశం పార్టీ ఎంపీ రామ్మోహన్ నాయుడు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. గురువారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాజ్యాంగం అమలు కావడం లేదన్నారు. జగన్‌రెడ్డికి పరిపాలన చేతకాదన్నారు. ఓ వైపు విద్యుత్‌ ఛార్జీలు పెంచి.. మరోవైపు కోతలు విధిస్తున్నారని మండిపడ్డారు. జగన్‌ది ప్రజా ప్రభుత్వం కాదని, రాక్షస ప్రభుత్వమని వ్యాఖ్యానించారు. ఆర్టీసీ ఛార్జీల పెంపు నిర్ణయం దారుణమని రామ్మోహన్‌ నాయుడు పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa