ఐపీఎల్ 2022 లో కొత్త రికార్డులు నెలకొంటూనే ఉన్నాయి. నిన్న SRH-PBKS మధ్య జరిగిన 28 మ్యచ్లో హైదరాబార్ ఫాస్ట్ బౌలర్ ఉమ్రాన్ మాలిక్ చరిత్ర సృష్టించాడు.నాలుగు ఓవర్లు వేసిన మాలిక్.. 28 పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు తీశాడు. అయితే 20వ ఓవర్ వేసిన మాలిక్ మేడిన్ ఓవర్ కావడం విశేషం. అయితే ఇది వరకు ఇలాంటి సంఘటనలు జరిగినప్పటికీ 20వ ఓవర్ లో ఒక్క పరుగు కూడా ఇవ్వకుండా..మూడు వికెట్లు.. ఒక రనౌట్తో చరిత్ర కెక్కాడు ఉమ్రన్ మాలిక్. ప్రస్తుతం ఫాస్టెస్ట్ ఇండియన్ బౌలర్గా పేరు తెచ్చుకున్న మాలిక్.. రానున్న వరల్డ్ కప్ బ్లూ జెర్సీ పోటీలో కచ్చితంగా ఉంటాడని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa