జిల్లా ఇంచార్జ్ కేటాయింపులో భాగంగా వెల్లంపల్లి శ్రీనివాస్ కి కొత్తగా ఏర్పాటైన ఎన్టీఆర్ జిల్లాని కేటాయించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో వేట మొదలైంది. రాబోయే రోజుల్లో ఇతర పార్టీల నుంచి మరిన్ని చేరికలుంటాయి. పశ్చిమ నియోజకవర్గంలో ఇతర పార్టీల అడ్రస్ గల్లంతవ్వడం ఖాయం. 2024కి నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలో ఉండేది వైఎస్సార్సీపీ మాత్రమే. చంద్రబాబు అమరావతిలో కూర్చుని విజయవాడ అభివృద్ధిని గాలికొదిలేశాడు. వైఎస్ జగన్ సీఎం అయిన తర్వాతే విజయవాడ అభివృద్ధి చెందింది.
టీడీపీ హయాంలో ఇక్కడి నేతలు రోడ్లు కూడా వేయించుకోలేకపోయారు. టీడీపీ నేతల ఇళ్లముందు కూడా మేమే రోడ్లు వేయించాం. ఎంపీ కేశినేని నాని ఎందుకున్నాడో అర్థం కావడం లేదు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి టీడీపీ ఇంఛార్జినని చెప్పుకుంటాడు. కేశినేనికి ఎన్నికలప్పుడే ప్రజలు గుర్తుకొస్తారు. రాబోయే రోజుల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కోసం నా వంతుగా శక్తివంచన లేకుండా కృషిచేస్తా. వచ్చే ఎన్నికల్లో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలను గెలిచి వైఎస్ జగన్కు కానుకగా ఇస్తా అని ధీమా వ్యక్తపరిచారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa