నరసరావుపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో చంద్రబాబు గారి పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో నరసరావుపేట టీడీపీ ఇంచార్జి చదలవాడ అరవింద్ బాబు పాల్గొన్నారు అలానే ఆయన టిడిపి నాయకులతో కలిసి , కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రాష్ట్రానికి దిశ నిర్దేశం చంద్రబాబు గారు ఆయన ఆలోచన విధానం వల్లే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి నవ్యాంధ్ర అభివృద్ధికి బాటలు వేసిన మహనీయుడు చంద్రబాబు గారు. రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు గారిని గెలిపించుకోకపోతే రాష్ట్రం సర్వనాశనం అవుతుంది. చంద్రబాబు గారి అడుగుజాడల్లో నడుస్తూ తెలుగుజాతికి పూర్వవైభవం తేవాలి. పరిపాలనా దక్షతతో ప్రపంచ దేశాల కళ్లు తెలుగువారి వైపు మళ్లించారు, అంకితభావంతో తెలుగుదేశం అభ్యున్నతికి పాటుబడ్డారు అని తెలియచేసారు. అందరూ 2024 ఎలక్షన్స్ దృష్టిలో పెట్టుకొని పని చెయ్యాలని కార్యకర్తలకి పిలుపు నిచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa