ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పెంచిన ఆర్టీసీ బస్సు ఛార్జీలను తగ్గించాలి: జనసేన

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Apr 20, 2022, 04:43 PM

పెంచిన ఆర్టీసీ బస్సు ఛార్జీ లను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే తగ్గించాలని హిందూపురం పట్టణంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ ఇంచార్జ్ ఆకుల ఉమేష్ ఆధ్వర్యంలో పట్టణంలోని అంబేద్కర్ సర్కిల్ నుండి ఆర్టీసీ బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించి బస్టాండ్ ఆవరణలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు.


బస్ చార్జీలను తగ్గించకపోతే జనసేన పార్టీ తరుపున నిరసనలు తీవ్రతరం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అనంతరం సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని ఆర్టీసీ అధికారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి నిమ్మకాయల రాము, సీనియర్ నాయకులు మల్లెపూల మధు, జిల్లా సంయుక్త కార్యదర్శి కొల్లకుంట శేఖర్, హిందూపురం, చిలమత్తూరు మండల అధ్యక్షులు చక్రవర్తి, చిన్నా ప్రవీణ్, నాయకులు గాజుల నాగభూషణం, నాగరాజు, బొంచేరువు భాస్కర్, చలపతి, ఇందిరానగర్ విజయ్, మనోహర్, పవన్ కుమార్, ప్రభు, నవీన్, లింగరాజు, పరిగి మధు, హనుమంతు, వెంకటేష్, నాగేంద్ర, మహేష్, హరీష్, నటరాజ, మౌలినాథ్, మునీర్, రవితేజ, జన సైనికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa