నిద్రలేమి... వయసు పైబడిన వాళ్ళతో పాటు చిన్న వయసు వారు కూడా ఈ మధ్య కాలంలో నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు. దీంతో చాలా మందికి గుండె జబ్బులు, డయాబెటిస్, స్థూలకాయం వంటి అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. జీవనశైలిలో చిన్నపాటి మార్పులు చేసుకోవడంతో పాటు సరైన పోషకాలు కలిగిన ఆహారాన్ని నిత్యం తీసుకుంటే నిద్రలేమి సమస్య నుంచి బయట పడవచ్చు. ఇందుకు మెగ్నిషియం ఎంతగానో దోహదపడుతుంది. మెగ్నిషియం ఉన్న ఆహారాలను నిత్యం తీసుకుంటే, నిద్రలేమి సమస్య నుంచి బయట పడవచ్చు. ఆల్కహాల్, సోడా, కాఫీ వంటి డ్రింక్స్ను ఎక్కువగా తీసుకున్నా మెగ్నిషియం లోపిస్తుంది. రుతుస్రావం తీవ్రంగా అయ్యే మహిళలు, తీవ్రమైన ఒత్తిడికి గురయ్యేవారు, చెమట బాగా పట్టేవారికి కూడా మెగ్నిషియం లోపిస్తుంది. నిద్రలేమి సమస్య ఉన్నవారిలో చాలా మందికి కండరాల నొప్పులు వస్తుంటాయి. కండరాలు పట్టేసినట్లు అనిపిస్తాయి. అలాగే తీవ్రమైన అలసట, కంగారు, ఆందోళన వంటి సమస్యలు ఉంటాయి. దీంతోపాటు జ్ఞాపకశక్తి తగ్గినట్లు అనిపిస్తుంది. ఇవన్నీ నిజానికి నిద్రలేమికి సూచనలే. ఈ లక్షణాలు ఉన్నవారు నిద్రలేమిని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. దీంతో ఆటోమేటిగ్గా ఆయా సమస్యలు కూడా తగ్గుతాయి. అందుకు మెగ్నిషియం దోహదపడుతుంది.
అవకాడోలు, అరటిపండ్లు, పాలకూర, జీడిపప్పు, బాదంపప్పు, ఇతర నట్స్, బ్రౌన్ రైస్, తృణ ధాన్యాలు, విత్తనాలు, బీన్స్, పప్పు దినుసులు, పచ్చి బఠానీలు, శనగలు, పాలు, పెరుగు, సోయా పిండి, ఇతర సోయా ఉత్పత్తులలో మెగ్నిషియం ఎక్కువగా ఉంటుంది. వీటిని నిత్యం ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా మెగ్నిషియం లోపం రాకుండా చూసుకోవచ్చు. దీంతోపాటు నిద్రలేమి సమస్య నుండి విముక్తి కూడా పొందవచ్చు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa