ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రియురాలి ఒత్తిడితో పురుషుడిగా మారిన మహిళ.. చివరకు

national |  Suryaa Desk  | Published : Thu, Apr 21, 2022, 11:48 AM

ప్రేమ కోసం పురుషుడిగా మారిన ఓ మహిళ ప్రియురాలి చేతిలో దారుణంగా మోసపోయింది. ఈ ఘటన తమిళనాడులోని మదురైలో చోటుచేసుకుంది. విల్లాపురం మీనాక్షినగర్‌ ప్రాంతానికి చెందిన జయసుధకు ఉమచ్చికులం ప్రాంతానికి చెందిన సెంథిలతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారడంతో వారు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే పురుషుడిగా మారాలని జయసుధపై సెంథిల ఒత్తిడి చేసింది. 2021 లో మదురై ప్రభుత్వ రాజాజీ ఆస్పత్రిలో జయసుధ శస్త్రచికిత్స చేయించుకుంది. తన పేరును ఆదిశివగా మార్చుకుంది. ఆ తర్వాత ఆదిశివ, సెంథిల ఓ ఆలయంలో పెళ్లి చేసుకున్నారు. ఈ విషయం సెంథిల తల్లిదండ్రులకు తెలిసింది. దీంతో వారు తిరుప్పరకుండ్రం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తల్లిదండ్రులతో వెళ్లిపోతానని సెంథిల చెప్పింది. తనకు తగిన న్యాయం చేయాలని కలెక్టర్‌ కు బుధవారం ఆదిశివ వినతిపత్రం అందజేశాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa