శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం, పోలవరం గ్రామంలో లో బుధవారం నీళ్ళ బకెట్లో పడి బాలుడు మృతి చెందిన విషాద సంఘటన చోటు చేసుకుంది. ముసిముసి నవ్వులతో ముద్దులు ఒలుకుతూ ఆటలాడుకుంటున్న ఓ బాలుడికి నీళ్ళ రూపంలో మృత్యువు కాటేసింది. వివరాల్లోకి వెళితే పోలవరంలో ఎడ్ల కృష్ణారావు భాగ్యవతి దంపతులకు మిథున్ కుమార్ అనే ఏడాదిన్నర వయసు గల కుమారుడు ఉన్నాడు. తల్లి భాగ్యవతి ఎప్పట్లాగే ఉదయం ఇంట్లో గిన్నెలు కడుగుతోంది. సమీపంలో స్నానాల గదిలో బకెట్ వద్దకు వెళ్లి మిథున్ ఆడుకుంటున్నాడు. కాసేపటికి ఎలాంటి శబ్దం రాకుండా ఎంతో తల్లికి అనుమానం వచ్చి చూసింది. అప్పటికే బాలుడు బకెట్లో తలకిందులుగా తేలి ఉండటాన్ని గుర్తించింది. వెంటనే గుండెలు బాదుకుంటూ హుటాహుటిన టెక్కలి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్ళింది. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. తమ గారాల బిడ్డ కళ్లెదుటే ఇలా కన్నుమూయడంతో ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. తండ్రి కృష్ణారావు సంతబొమ్మాళి మండలం లో వీఆర్ఓ గా పనిచేస్తున్నారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa