ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మొదటి భార్యతో కలిసి రెండో భార్యను చంపేసిన భర్త

Crime |  Suryaa Desk  | Published : Thu, Apr 21, 2022, 12:58 PM

కొడుకు కోసం ఓ వ్యక్తి రెండో పెళ్లి చేసుకున్న ఘటన తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. బాబు పుట్టగానే మొదటి భార్యతో కలిసి రెండో భార్యను హత్య చేశాడు. ఆస్తిలో వాటా అడిగినందుకు హతమార్చారు.బుధవారం నడిచారు. కొత్తూరు పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.


కొత్తూరు మండలం లోక్యతండాకు చెందిన కేతావత్ శ్రీనివాస్ (46), మంజుల (35) దంపతులకు ముగ్గురు కుమార్తెలు. అయితే కొడుకు కోసం చింతగట్టుకు చెందిన సాలీ(21) అనే మహిళను శ్రీనివాస్ మూడేళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. ఎకరం భూమి రాస్తానని గతంలో ఒప్పందం చేసుకున్నాడు. వీరికి ఇప్పుడు రెండేళ్ల కొడుకు ఉన్నాడు. బుధవారం ఉదయం సాలీ తండ్రి ముదావత్ లక్య కుమార్తెను చూసేందుకు వెళ్లాడు. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఇంటికి తిరిగొచ్చాడు. దారిలో గూడూరు పంచాయతీలోని రామయ్య చెరువు వద్ద జనాన్ని చూసి అక్కడికి వెళ్లాడు. అతని కూతురు చెరువులో శవమై కనిపించింది. 


పెళ్లై మూడేళ్లు గడుస్తున్నా భూమి రాసివ్వకపోవడంతో ఇటీవల గొడవలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో చింతగట్టుతండాలో ఉన్న భార్యను ఈ నెల 18న భర్త శ్రీనివాస్ లోక్యాతండాకు తీసుకొచ్చాడు. 19న రాత్రి శ్రీనివాస్‌ తన మొదటి భార్య మంజులతో కలిసి సాలీని గొంతు నులిమి హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని స్థానిక చెరువులో పడేశారు. నిందితులు కొత్తూరు పోలీస్‌ స్టేషన్ లో లొంగిపోయినట్లు సమాచారం. సాలీ బంధువులు శ్రీనివాస్‌ ఇంటిపై దాడి చేశారు. న్యాయం జరిగేవరకు చెరువులో నుంచి మృతదేహాన్ని బయటకు తీయనివ్వలేదు. పెద్దల సమక్షంలో బాబు పేరిట ఆస్తి పంపకానికి ఒప్పుకుంటున్నట్లు రాయించుకున్నారని సమాచారం. దీంతో సాయంత్రం శవాన్ని చెరువులో నుంచి బయటకు తీసి షాద్‌నగర్‌ కమ్యూనిటీ ఆసుపత్రికి తరలించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa