ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చంద్రబాబు కన్నీళ్లు తుడవటానికె పవన్‌ కల్యాణ్‌ బయటకు వచ్చారు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Apr 24, 2022, 12:02 PM

రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ జనరంజక పాలనతో ప్రజల్లో అపరిమిత అభిమానాన్ని పొందారు. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పర్యటనలో జనసేన కార్యకర్తలే జై జగన్‌ అంటూ ఇచ్చిన నినాదాలు ఇందుకు నిదర్శనం అని ఏపీ రోడ్లు, భవనాల శాఖ మంత్రి దాడిశెట్టి రాజా  అన్నారు. రాష్ట్రంలో ప్రజలు ఆనందంగా ఉంటే పవన్‌ కల్యాణ్‌ మాత్రం వారంతా కష్టపడుతున్నట్టుగా మొసలి కన్నీరు కారుస్తున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పాలనలో రాష్ట్ర ప్రజలకు కష్టాలు లేవు. పవన్‌ కల్యాణ్‌కి, చంద్రబాబుకి మాత్రమే కష్టాలు ఉన్నాయి. కష్టాల్లో ఉన్న చంద్రబాబు కన్నీళ్లు తుడవటానికి పవన్‌ కల్యాణ్‌ బయటకు వస్తున్నారు. చంద్రబాబు పాలనలో అరాచకాలు, కష్టాలు పడ్డ రైతుల కన్నీళ్లు పవన్‌ కల్యాణ్‌కు కనిపించలేదా? అని ప్రశ్నించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa