దేశంలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం సమీక్ష నిర్వహించనున్నారు. వీడియో కాన్ఫరెన్స్లో జరిగే ఈ సమావేశంలో వైరస్ కట్టడికి రాష్ట్రాలు తీసుకుంటున్న చర్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సీఎం లతో ప్రధాని మోదీ చర్చించనున్నారు. బుధవారం మధ్యాహ్నం 12గంటలకు ఈ కార్యక్రమం జరగనుంది. మే నెలలో పండుగలు ఉన్నందున ప్రతి ఒక్కరూ కరోనా నిబంధనలు పాటించాలని ఇటీవల 'మన్కీ బాత్' ప్రసంగంలో దేశ ప్రజలకు ప్రధాని మోదీ విజ్ఞప్తి చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa