ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నిరసన...అసహనం ఇలా కూడా వ్యక్తంచేయవచ్చు

national |  Suryaa Desk  | Published : Tue, Apr 26, 2022, 09:46 PM

ఏదైనా కారణంగా మనకు చికాకు వస్తే, అసహనంకు లోనుకావాల్సి వస్తే మీరేం చేస్తారు. కానీ ఓ వ్యక్తి మాత్రం చాలా చక్కగా తన అసహనాన్ని వ్యక్తంచేశాడు. పెట్రోల్ ధరలతో విసిగెత్తి.. ఎలక్ట్రానిక్ బైక్‌లు కొంటున్నవారికి నిరాశే మిగులుతుంది. కొన్ని బాంబులై పేలి ప్రాణాలు తీస్తుంటే.. మరికొన్ని కదలనంటూ మొరాయిస్తున్నాయి. వాహనం కొన్న కొన్ని వారాలకే పాడవడంతో ఓ వినియోగదారుడుకి చిరాకు వచ్చింది. కంపెనీకి మొరపెట్టుకున్నా ప్రయోజనం లేకపోయింది. ఆ వాహనాలపై, సంబంధిత కంపెనీలపై చెప్పలేనంత కోపం వచ్చింది. దాంతో చాలా వెరైటీగా తన అక్కసును వెళ్లగక్కాడు. ఎలక్ట్రిక్ స్కూటర్‌ని గాడిదకు కట్టి రోడ్లపై తిప్పాడు.


మహారాష్ట్ర పర్లీవైజ్ నాథ్‌కు చెందిన సచిన్ గిట్టే పెట్రోల్ ధరల నుంచి తప్పించుకోవడానికి ఎలక్ట్రిక్ స్కూటర్‌ను కొనుగోలు చేశాడు. గతేడాది సెప్టెంబర్‌లో రూ.20 వేలు అడ్వాన్స్ చెల్లించి ఎలక్ట్రిక్ స్కూటర్‌ను బుక్ చేసుకున్నాడు. మిగిలిన రూ.65 వేలు ఈ జనవరిలో కట్టాడు. మార్చి 24వ తేదీన స్కూటర్ చేతికి వచ్చింది. అయితే ఆ సంతోషం ఎంతోకాలం నిలవలేదు. బండి ఇంటికొచ్చిన రెండు వారాలకే అది ఆగిపోయింది. కంపెనీ కస్టమర్‌ కేర్‌కు ఫోన్ చేసి సంస్థ ప్రతినిధులకు సంప్రదించగా వాళ్లు మెకానిక్‌ను పంపించారు. అయితే ఆ మెకానిక్‌ కూడా స్కూటర్‌ను బాగు చేయలేకపోయాడు






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa