గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం తుమ్మపూడికి చెందిన వివాహిత హత్య కేసు సంచలనం రేకెత్తించింది. బాధితురాలిపై లైంగికి దాడికి పాల్పడి, హత్య చేశారనే ఆరోపణలు మొదట వినిపించాయి. అయితే ఆ ప్రచారంలో నిజం లేదని గుంటూరు అర్బన్ ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ తేల్చి చెప్పడంతో కేసు మరో మలుపు తిరిగింది. బాధితురాలి హత్యకు వివాహేతర సంబంధమే కారణమని ఎస్పీ వెల్లడించారు. టీడీపీ కార్యకర్త కొర్రపాటి వెంకట సతీష్ చౌదరి తన కంటే 11 ఏళ్లు పెద్దదైన అదే గ్రామానికి చెందిన బాధితురాలితో వివాహేతర సంబంధం పెట్టుకున్నట్టు ఎస్పీ వివరించడం జరిగింది. తన స్నేహితుడు శివసత్య సాయిరామ్ కోరికను కూడా తీర్చాలని ఆమెను వేధించేవాడని, అందుకు బాధితురాలు అంగీకరించకపోవడంతో శివసత్య సాయిరామ్ ఆమెను దారుణంగా హత్యచేశాడని విచారణలో తేలినట్టు ఎస్పీ తెలియజేశారు.
ఎస్పీ ప్రకటనపై మృతురాలి భర్త నేడు అభ్యంతరం వ్యక్తం చేశాడు. వివాహేతర సంబంధమనే వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశాడు. తన భార్యపై పోలీసుల ఆరోపణలు చేయడం దారుణమని అన్నారు. ఎస్పీ తన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోకపోతే ఎస్పీ కార్యాలయం ఎదుట తాను ఆత్మహత్య చేసుకుంటానని అన్నారు. పోస్టుమార్టం చేయకుండానే తన భార్యపై లైంగిక దాడి జరగలేదని పోలీసులు ఎలా చెబుతారని భర్త ప్రశ్నించాడు. పోలీసులు దీనిపై విచారణకు ఆదేశించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa