ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అసలు రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా? ఎమ్మెల్యే ఏలూరి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, May 01, 2022, 05:19 PM

బహిరంగ ప్రదేశాల్లో కూడా మానభంగాలు జరుగుతున్నాయంటే అసలు ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం, పోలీసు వ్యవస్థ ఉందా అన్న అనుమానం కలుగుతోందని బాపట్ల పార్లమెంటు టిడిపి అధ్యక్షుడు, పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు పేర్కొన్నారు. రేపల్లె రైల్వే స్టేషన్ లోనే ఒక వివాహితపై గ్యాంగ్ రేప్ జరగడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వ అసమర్థత, చేతకానితనం వలన శాంతి భద్రతలు అధ్వాన్నంగా తయారయ్యాయని ధ్వజమెత్తారు.

మహిళల మీద అఘాత్యాలు పెరిగిపోతుంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిమ్మకు నీరెత్తినట్లు చూస్తున్నారని దుమ్మెత్తి పోశారు. పోలీసు శాఖ మొత్తాన్ని తన కక్ష సాధింపుకు ప్రతిపక్ష పార్టీల నాయకుల మీదకు వదలి, ప్రజల భద్రతను గాలికొదిలేశారని ఆయన పేర్కొన్నారు. ఇలాంటి ఘటనల్లో దోషులను కఠినంగా శిక్షించాలని ఏలూరి డిమాండ్ చేశారు. తెలుగుదేశం పార్టీ మహిళలకు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa