ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భద్రాచల శ్రీరామకోటి పాదయాత్రికులకు సత్కారం

Bhakthi |  Suryaa Desk  | Published : Mon, May 02, 2022, 01:21 PM

శ్రీరామకోటి నామాలతో భద్రాచల పాదయాత్ర పూర్తి చేసిన ఇంద్రపాలెం గ్రామభక్తులను కాకినాడ భోగిగణపతిపీఠం ఘనంగా సత్కరించింది. సోమవారం ఉదయం పీఠం ప్రాంగణంలో పూజాధికాలు నిర్వహించారు. స్వామి వారి శేషవస్త్రాలతో సత్కరించి సమస్త దేవతా ప్రార్థనల సహస్ర నామగ్రంధంతో రాగి ఉద్దరిణిపూజాపాత్రలను బహూకరించారు. 


పీఠం ఉపాసకులు దూసర్లపూడి రమణ రాజు మాట్లాడుతూ ఆధ్యాత్మిక ప్రగతి ఏర్పడిన సమాజంలో ప్రశాంతత శాంతి సౌభాగ్యం వర్ధిల్లుతా యన్నారు. శ్రీరామకోటి పాదయాత్రికులు మేడిశెట్టి రమణ మూర్తి మాట్లాడుతూ లోకకళ్యాణార్థం భద్రాచలయాత్ర జరిగిందని తెలిపారు. పాదయాత్రికులు మేడిశెట్టి రామ్మోహన్ అనసూరి శివబాబు సత్యనారాయణ శ్రీరాములు సీతామహాలక్ష్మి శ్రీనివాసు సత్య శంకర్ పాపయ్యనాయుడు మున్నగు వారు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa