భారతీయ జనతా యువమోర్చా (BJYM) రాష్ట్ర పిలుపు మేరకు గుంటూరులో ఉన్న జిన్నా టవర్ కు పేరు మార్చి ఏ. పి. జె. అబ్దుల్ కలాం పేరు పెట్టాలని కోనసీమ జిల్లా యువ మోర్చా అధ్యక్షుడు కటికిరెడ్డి గంగాధర్ అధ్యక్షతన కలెక్టర్ ముందు ధర్నా నిర్వహించారు.
భారతదేశానికి స్వాతంత్ర్యం లభించి 75 ఏళ్లు పూర్తై "ఆజాదీ కా అమృత్ మహోత్సవ్" అంటూ సంబరాలు చేసుకుంటున్న ఈ తరుణంలో లో దేశ విభజనలో ప్రధానమైన కారకుడిగా ఉన్నా పాకిస్తాన్ జాతిపిత జిన్నా పేరు మీద గుంటూరులో లో జిన్నా టవర్ ఉండడాన్ని భారతీయ జనతా యువ మోర్చా కోనసీమ జిల్లా ఖండిస్తుంది.
గుంటూరు నగరంలో జిన్నా టవర్ ఉండడం అంటే యావత్ భారతీయ సమాజాన్ని అవమాన పరిచినట్లే. కావున గుంటూర్ లో ఉన్న జిన్నా టవర్ కు పేరు తొలగించి భారతదేశపు మిస్సైల్ మ్యాన్, భారత 11 వ రాష్ట్రపతి గా ఈ దేశానికి సేవలందించిన మహనీయుడు భారతరత్న ఏపీజే అబ్దుల్ కలామ్ గారి పేరు గుంటూరులో ఉన్న టవర్ కు పెట్టాలని భారతీయ జనతా యువమోర్చా (BJYM) డిమాండ్ చేస్తూందంటూ కోనసీమ జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి యువ మోర్చా ఇన్చార్జ్ మోకా వెంకట సుబ్బారావు, యువ మోర్చా నరసాపురం పార్లమెంట్ ఇన్చార్జి పాలూరి జయప్రకాష్ , జిల్లా కార్యదర్శి గొల్లకోటి వెంకటేశ్వరరావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సరిది దుర్గాప్రసాద్ కోనసీమ జిల్లా యువమోర్చా ప్రధాన కార్యదర్శులు కొండేటి ఈశ్వర్ గౌడ్ , నేదునూరి రాజేష్, ఎస్సీ మోర్చా జోనల్ ఇంచార్జ్ దూరి రాజేష్, జిల్లా ఉపాధ్యక్షుడు కోటిపల్లి దామోదర్ జిల్లా సోషల్ మీడియా యనమదల వెంకటరమణ భారతీయ జనతా పార్టీ అమలాపురం టౌన్ ప్రధాన కార్యదర్శి అరిగెల తేజ వెంకటేష్ , అమలాపురం టౌన్ యువ మోర్చా అధ్యక్షుడు కాట మధు, ప్రధాన కార్యదర్శి నండూరి శ్రీరామ్, అమలాపురం రూరల్ ప్రధాన కార్యదర్శి బొంతు శివాజీ, అంబాజీపేట మండలం అధ్యక్షుడు కుడుపూడి సురేష్, పి. గన్నవరం మండల అధ్యక్షుడు గొల్లకోటి సూర్యనారాయణ తదితర యువమోర్చా కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa