ట్రెండింగ్
Epaper    English    தமிழ்

న్యాయం చెయ్యాల్సిన పోలీస్ వారే శిక్షించారు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, May 02, 2022, 01:29 PM

హిందూపూర్ నియోజకవర్గం చిలమత్తుర్ మండలం సంజీవరాయనపల్లి గ్రామంలో  దివ్యాంగురాలు పద్మావతి కి పెన్షన్ ఎందుకు ఇవ్వడం లేదని కొడుకు వేణు ప్రశ్నిస్తే స్థానిక వైసిపి నేత దామోదర్ రెడ్డి దాడి చేసాడు అని తెలియచేసారు. జరిగిన అన్యాయంపై ఫిర్యాదు చెయ్యడానికి పోలీస్ స్టేషన్ కి వెళితే అక్కడ ఎస్ఐ తనను ఘోరంగా అసభ్య పదజాలంతో బూతులు తిడుతూ దాడి చెయ్యడం జరిగింది అని వేణు వాపోయారు.  ఈ విషయంపై స్పందించిన టీడీపీ నాయకులూ నారా లోకేష్ మాట్లాడుతూ...  వేణు పై దాడి చేసిన వైసిపి నేతలు, ఎస్ఐ పై తక్షణమే చర్యలు తీసుకొని దివ్యాంగురాలైన తల్లి పద్మావతి కి పెన్షన్ ఇవ్వాలి అని డిమాండ్ చేసారు. న్యాయం చెయ్యవలసిన పోలీసులే దాడి చేస్తే ఇంక ప్రజలు ఎక్కడికి వెళ్ళాలి, ఎవరిని అడగాలి అని వాపోయారు. ఫిర్యాదు చెయ్యడానికి పోలీస్ స్టేషన్ కి వెళ్ళిన బాధితుడిని బూతులు తిడుతూ భౌతిక దాడి చెయ్యడాన్ని రాజా రెడ్డి రాజ్యాంగంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటారా జగన్ రెడ్డి గారు? అని ప్రశ్నించారు.  


 






 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa