ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పాస్ పోర్ట్ సేవలు కూడా సచివాలయాలలోనే

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, May 02, 2022, 01:30 PM

రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత  సచివాలయ వ్యవస్థని తీసుకురావడం జరిగింది. ప్రజలకి అందుబాటులో అన్ని రకాల సేవలు త్వరగా జరిగేలా చర్యలు చేపట్టారు. అలానే, పారదర్శకత చూపిస్తూ.. లంచాలకు, అవినీతికి తావు లేకుండా ఈ వ్యవస్థను తీసుకు వచ్చామని  సీఎం జగన్ తెలియచేసారు. ఈ క్రమంలోనే,  సచివాలయంలో  మరి కొన్ని సేవలు అందించేందుకు  ప్రభుత్వం ఆలోచిస్తుంది. పాస్ పోర్ట్ సేవలు కూడా ప్రారంభించాలని, అలానే ఫైలైట్ ప్రాజెక్టుగా 1600 సచివాలయాలలో ఈ సేవలు ప్రారంభిస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. అలానే పాన్ కార్డు సేవలు, టికెట్ బుకింగ్ సేవలు కూడా చేయనున్నట్లు తెలియచేసారు. దీని వలన రాష్ట్రంలో ప్రజలకి, ముఖ్యంగా గ్రామాలలో ఉండే వారికీ పనులు సులభతరం అవ్వనున్నాయని తెలియపరిచారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa