ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అండమాన్‌ దీవుల్లో భూకంపం

international |  Suryaa Desk  | Published : Mon, May 09, 2022, 01:39 PM

అండమాన్ నికోబార్ దీవుల్లో భూకంపం సంభవించింది. సోమవారం (మే 9, 2022) తెల్లవారుజామున 1.11 గంటల సమయంలో క్యాంప్‌బెల్‌ బే వద్ద ఒక్కసారిగా భూమి కంపించింది. భూప్రకంపనల తీవ్రత..రిక్టర్‌ స్కేలుపై 4.4గా నమోదైంది. ఈ మేరకు నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సీస్మోలజీ (NCS) ఒక ప్రకటనలో వెల్లడించింది. భూకంపకేంద్రం క్యాంప్‌బెల్‌ తీరానికి 85 కిలోమీటర్ల దూరంలో ఉందని పేర్కొంది. ఆదివారం అర్ధరాత్రి సమయంలో భూమి ఒక్కసారిగా కంపించింది. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. భూకంపం కారణంగా ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదన్నారు.


అండమాన్‌ దీవుల్లో పది రోజుల వ్యవధిలో భూకంపం రావడం రెండోసారి. ఏప్రిల్‌ 30న డిగ్లిపూర్‌లో 11.04 గంటలకు భూకంపం సంభవించినట్టు ఎన్‌సీఎస్‌ వెల్లడించింది. ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.1గా నమోదైందని వెల్లడించింది. ఇటీవలే ఇదే ప్రాంతంలో భూకంపం వచ్చింది. క్యాంప్‌బెల్ బేకు ఈశాన్యంలో 70 కిలోమీటర్ల దూరంలో భూమి ఒక్కసారిగా కంపించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.9గా నమోదైందని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సీస్మోలజీ (NCS) అధికారులు పేర్కొన్నారు.గుజరాత్‌ గిర్ సోమనాథ్ జిల్లాలో రెండుసార్లు భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై మొదటిసారి 4.0, రెండోసారి 3.2గా నమోదైంది. ఈ మేరకు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సిస్మోలాజికల్ రీసెర్చ్ (ISR) ఒక ప్రకటనలో వెల్లడించింది. 4.0 తీవ్రతతో భూకంపం ఉదయం 6.58 గంటలకు సంభవించినట్టు తెలిపింది. ఉత్తర-ఈశాన్యంగా 13కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa