ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇండిగో విమాన సిబ్బంది చర్యలకు ఆదేశించిన కేంద్ర మంత్రి

national |  Suryaa Desk  | Published : Mon, May 09, 2022, 01:41 PM

విమానం ఎక్కేందుకు వచ్చిన వికలాంగ బాలుడిని, అతని తల్లిదండ్రులను విమానంలోకి అనుమతించకుండా ఇండిగో ఎయిర్ లైన్స్ సిబ్బంది వ్యవహరించిన తీరుపై సర్వత్రా విమర్శలు వెలువెత్తుతున్నాయి.ఈఘటనపై దిగ్బ్రాంతి వ్యక్తం చేసిన కేంద్ర పౌరవిమానయానశాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా..ఇండిగో విమాన సిబ్బందిపై చర్యలకు ఆదేశించారు. వివరాల్లోకి వెళితే..రాంచి ఎయిర్ పోర్ట్ లో విమానం ఎక్కేందుకు వచ్చిన ఒక వికలాంగ బాలుడిని అతని తల్లైదండ్రులను ఇండిగో విమాన సిబ్బంది అడ్డుకున్నారు. చక్రాల కుర్చీలో కూర్చుని ఉన్న ఆ బాలుడిని విమానంలో ఎక్కించేది లేదంటూతేల్చి చెప్పారు. గంట పాటు కారులో ప్రయాణించి అసౌకర్యంగా ఉండడంతో విమానం ఎక్కలేనంటూ బాలుడు గొడవ చేస్తున్నాడు. దీంతో బాలుడిని బుజ్జగించిన తల్లిదండ్రులు ఎలాగోలా విమానం ఎక్కించేందుకు ఒప్పించారు. అయినా చక్రాల కుర్చితో బాలుడిని విమానంలోకి ఎక్కిస్తే తిప్పలు తప్పవంటూ ఇండిగో సిబ్బంది ఆ తల్లిదండ్రులను అవమానపరిచారు.


దీంతో పక్కనే మరికొందరు ప్యాసింజర్లు కలగజేసుకుని బాలుడిని అతని తల్లిదండ్రులను విమానంలోకి ఎక్కించాలంటూ విమాన సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. దీంతో అక్కడికి చేరుకున్న ఇండిగో స్థానిక మేనేజర్..చక్రాల కుర్చీలో ఉన్న బాలుడిని విమానం ఎక్కించడం కుదరదని..అందులోనూ ఆ పిల్లవాడి ప్రవర్తన తాగుబోతులా ఉందంటూ వ్యంగ్యంగా మాట్లాడాడు. అనంతరం సదరు కుటుంబాన్ని ఎక్కించుకోకుండానే విమానం హైదరాబాద్ బయలుదేరింది. ఈఘటనకు ప్రత్యక్ష సాక్ష్యంగా నిలిచిన మరొక ప్యాసింజర్ ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా పంచుకుంటూ కేంద్ర పౌరవిమానయాన మంత్రిత్వశాఖకు ట్యాగ్ చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa