ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రహస్య ప్రాంతంలో తలదాచుకున్న మాజీ ప్రధాని

international |  Suryaa Desk  | Published : Tue, May 10, 2022, 04:36 PM

ఆర్థిక, ఆహార సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకలో పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయి. ఆందోళనకారుల ధాటికి ప్రధాని పదవికి మహింద రాజపక్సే రాజీనామా చేశారు. అయినప్పటికీ ఆయనపై కోపంతో ఆందోళనకారులు అధికారిక నివాసాన్ని చుట్టుముట్టారు. 10కి పైగా పెట్రోల్ బాంబులను వేశారు. అప్రమత్తమైన భద్రతా దళాలు ఆయన నివాసం చుట్టూ భారీగా మోహరించాయి. అయినప్పటికీ నిరసనలు ఆగలేదు. మరోవైపు మాజీ ప్రధాని రాజపక్సతో సహా ఆయన కుటుంబాన్ని భద్రతాదళాలు రహస్య ప్రాంతానికి తరలించాయి. రాజధాని కొలంబోకు 270 కి.మీ. దూరంలోని ట్రింకోమలి నేవీ బేస్‌కు తీసుకెళ్లారు. ఈ విషయం పసిగట్టిన ఆందోళనకారులు అక్కడకు కూడా చేరుకున్నారు.


ఇప్పటికే మాజీ ప్రధాని మహింద రాజపక్స కుమారుడు నమల్ తన ఫ్యామిలీతో సహా ప్రాణభయంతో రహస్య ప్రాంతంలో తలదాచుకున్నట్లు తెలుస్తోంది. నిన్నే ప్రధాని పదవికి రాజపక్స రాజీనామా చేయగా, దానిని దేశాధ్యక్షుడు గొటబయ రాజపక్స ఆమోదించారు. ప్రధాని పదవిని చేపట్టాలని మాజీ ప్రధాని మైత్రిపాల సిరిసేనను ఆయన ఆహ్వానించారు. ఆందోళనల్లో అధికార పార్టీ ప్రజాప్రతినిధుల నివాసాలకు ప్రజలు నిప్పు పెట్టారు. పోలీసులు వారిని అదుపు చేసే క్రమంలో ఒక ఎంపీ, ఐదుగురు ఆందోళనకారులు మృతి చెందినట్లు తెలుస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa