ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నీటి ఇక్కట్లను పరిష్కరించాలని వేడుకుంటున్న పరిటాల

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, May 11, 2022, 03:07 PM

రాయలసీమ రతనాల సీమ అని అందరూ అంటుంటారు. కానీ, అక్కడ ప్రజల ఇబ్బందులు మాత్రం ఎవరికీ తెలియవు. బీడు భారిన భూములు, భారీ ఎండలు , కొండ ప్రాంతాలు ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే సమస్యలు ఉన్నాయ్. ఈ నేపథ్యంలో అక్కడ వ్యవసాయానికి సాగు నీరు లేకపోవడంతో పాటు త్రాగు నీరు కి కూడా ఇబ్బంది పడుతున్నారు అంటే నమ్మక తప్పదు. ప్రభుత్వాలు మారిన , ప్రజా ప్రతినిధులు మారిన  ఈ సమస్యలకి మాత్రం శాశ్విత పరిష్కారం చేయలేకపోతున్నారు. తాజాగా  అనంతపురం టీడీపీ నాయకులూ పరిటాల శ్రీరామ్ స్పందిస్తూ... గత పది రోజులుగా ధర్మవరం పట్టణ ప్రజలు త్రాగునీటి కోసం పడే కష్టాలు వర్ణనాతీతం.. ధర్మవరం ప్రజల నీటి ఇక్కట్లను  పరిష్కరించాలని, అంతలోపు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ప్రజలకు తాగునీరు అందించాలని మున్సిపల్ కమిషనర్ గారికి వినతి పత్రంతో సమస్యను వివరించడం జరిగింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa