శ్రీకాకుళం జిల్లాలో ఓ వింత జరిగింది. సంతబొమ్మాళి మండలం ఎం.సున్నాపల్లి సముద్రం రేవుకు బంగారు పూత పూసిన రథం కొట్టుకొచ్చింది. మంగళవారం ఈ ఘటన జరిగింది. ఈ రథం పై విదేశీ భాషలో 16-1-2022 అని రాసి ఉంది. రథాన్ని మెరైన్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇది ఎక్కడి నుంచి కొట్టుకు వచ్చిందనే దాని పై ఆరా తీస్తున్నారు. మలేషియా, థాయిలాండ్, జపాన్ దేశాలకు చెందిన రథంగా అనుమానిస్తున్నారు. ఈ రథాన్ని చూసి స్థానికులు అనుభూతికి లోనయ్యారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa