ట్రెండింగ్
Epaper    English    தமிழ்

1857 సిపాయిల తిరుగుబాటు నాటి భారత సైనికుల అస్థిపంజరాలు లభ్యం!

national |  Suryaa Desk  | Published : Wed, May 11, 2022, 08:43 PM

282 మంది భారత సైనికుల అస్థిపంజరాలు లభ్యం అయ్యాయి. బ్రిటిష్‌ పాలనలో 1857 సిపాయిల తిరుగుబాటుకు ఎంతో ప్రాధాన్యత ఉంది. 1857 సిపాయిల తిరుగుబాటును భారత తొలి స్వాతంత్ర సంగ్రామంగా చెబుతారు. మరి ఇటువంటి యుద్ధంలో మరణించిన 282 మంది భారత సైనికుల అస్థిపంజరాలను పంజాబ్‌లో గుర్తించారు. అమృత్‌సర్‌ సమీపంలో జరిపిన తవ్వకాల్లో సైనికుల అస్థిపంజరాలను గుర్తించారు.

పంజాబ్‌ యూనివర్సిటీలోని ఆంత్రోపాలజీ విభాగం అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ జేఎస్‌ సెహ్రావత్‌ వీర సైనికుల అస్తిపంజరాలను గుర్తించినట్లు తెలిపారు. అజ్నాలాలో మతపరమైన కట్టడం కింద ఉన్న బావిలో తవ్వకాలు జరుపగా ఈ అస్తిపంజరాలు దొరికాయి. 282 మంది భారత సైనికుల అస్థిపంజరాలను గుర్తించినట్లుగా అధికారులు తెలిపారు






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa