ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఐపీఎల్: ఢిల్లీకి 161 పరుగుల టార్గెట్ ఇచ్చిన రాజస్థాన్

sports |  Suryaa Desk  | Published : Wed, May 11, 2022, 09:36 PM

ఐపీఎల్-2022 సీజన్‌లో నేటి రాత్రి ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో  ముందు టాస్ గెలిచిన ఢిల్లీ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. ప్రత్యర్థి రాజస్థాన్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ప్లే ఆఫ్ చేరాలంటే ప్రతి మ్యాచ్ గెలవడం ముఖ్యం. ఈ దశలో ఈ రెండు జట్ల మధ్య పోరులో ఏది విజయం సాధించనుందే కొన్ని గంటల్లో తేలనుంది.

అయితే ఫస్ట్ హాఫ్ లో బ్యాటింగ్ కి దిగిన రాజస్థాన్ రాయల్స్ 20 ఒవెర్స్ లో 6 వికెట్స్ నష్టానికి 160 పరుగులు చేసి ఢిల్లీకి 161 పరుగుల లక్ష్యాన్ని ఇచ్చింది. రవిచంద్రన్ అశ్విన్ హాఫ్ సెంచరీ(50), దేవ్‌ధూత్ పడిక్కల్(48) రాణించడంలో నిర్ణీత 20 ఓవర్లలో 160 పరుగులు నమోదు చేసింది. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ విజయ లక్ష్యం 161 పరుగులుగా ఉంది. రాజస్థాన్ రాయల్స్ బ్యాట్స్‌మెన్లలో యశస్వి జైస్వాల్ (19), జాస్ బట్లర్ (7), రవిచంద్రన్ అశ్విన్(50), దేవ్‌ధూత్ పడిక్కల్(48), సంజూశాంసన్(6), రియాన్ పరాగ్(9), వాండెర్ డస్సెన్(12 నాటౌట్), ట్రెంట్ బౌల్ట్ (3 నాటౌట్) చొప్పున పరుగులు చేశారు. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లలో చేతన్ సర్కారియా 2 వికెట్లు, అన్రిచ్ నొర్ట్జే 2 వికెట్లు, మిచెల్ మార్ష్ 2 చొప్పున వికెట్లు తీశారు.

రాజస్థాన్ రాయల్స్ (తుది జట్టు): యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, సంజు శాంసన్(కెప్టెన్&వికెట్ కీపర్), దేవదత్ పడిక్కల్, రాస్సీ వాన్ డెర్ డుసెన్, రియాన్ పరాగ్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, ప్రసిద్ధ్ కృష్ణ, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ సేన్

ఢిల్లీ క్యాపిటల్స్ (తుది జట్టు): డేవిడ్ వార్నర్, శ్రీకర్ భరత్, మిచెల్ మార్ష్, రిషబ్ పంత్(కెప్టెన్&వికెట్ కీపర్), లలిత్ యాదవ్, రోవ్‌మన్ పావెల్, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, చేతన్ సకారియా, కుల్దీప్ యాదవ్, అన్రిచ్ నార్ట్జే






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa