ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మళ్ళి గెలవాలంటే కలిసి పని చెయ్యండి.

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, May 15, 2022, 01:45 PM

బైరెడ్డి సిద్ధార్థ నియోజకవర్గ సమన్వయకర్తగా ఎమ్మెల్యే ఆర్థర్‌ గెలుపునకు కృషి చేశారు. ఆ తర్వాత వీరిద్దరి మధ్య వ్యవహారం బెడిసికొట్టింది. స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో ఆ విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. తమ వర్గం వారికి టికెట్లను ఇప్పించుకునే విషయంలో గొడవలకు సైతం దిగారు. కర్నూలు పాత బస్టాండ్‌, కొత్త బస్టాండ్‌కు సమీపంలోని ప్రైవేటు హోటల్‌లో సీనియర్‌ నాయకులు ముందే గొడవపడ్డారు. అప్పటి జిల్లా ఇన్‌చార్జి మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రులు ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చారు. వారి ముందు సరేనంటూ చేతులు కలిపినా తర్వాత ఆర్థర్‌, సిద్ధార్థ ఎవరికి వారే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.గత ఏడాది మిడ్తూరు మండలంలోని సచివాలయ భవనాల ప్రారంభోత్సవ సమయంలో ఆర్థర్‌, సిద్ధార్థ మధ్య విభేదాలు సమసిపోలేదన్న విషయం మరోసారి బహిర్గతమైంది. దానికి తోడు గడప గడపకు వైసీపీ కార్యక్రమంలో ఇద్దరు కలిసి సాగడం లేదన్న విషయం వైసీపీ పెద్దలు దృష్టికి వెళ్లింది. ఇలా నియోజకవర్గంలో ఇద్దరి మధ్య సమన్వయం లేకపోతే ఆ ప్రభావం వచ్చే ఎన్నికల్లో పడే అవకాశం ఉందని వైసీపీ అధి నాయకత్వం భావించినట్లుంది. ఇప్పటికే గడప గడపకు వైసీపీ కార్యక్రమంలో ప్రజల్లో పార్టీ వ్యతిరేకత కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఇక ఇలాంటి సమయంలో నియోజకవర్గంలోని ఇద్దరు ముఖ్య నాయకులు గొడవ పడటం పార్టీకి అసలు మంచిది కాదని ఇద్దరిని పిలిచి మరీ క్లాస్‌ పీకారని, గడప గడపకు వైసీపీ కార్యక్రమంలో కలిసి పాల్గొనాలని వైసీపీ పెద్దలు సూచించినట్లు సమాచారం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa