ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈ నెల 17 నుండి నెల్లూరు లో "పవనన్న ప్రజాబాట"

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, May 15, 2022, 01:46 PM

నెల్లూరు జిల్లా , జనసేన పార్టీ ఇంచార్జి కెత్తంరెడ్డి వినోద్ రెడ్డి ఆధ్వర్యంలో జనసేన పార్టీ పుంజుకుందని చెప్పాలి. నిత్యం ప్రజలతో మమేకమౌతూ... ప్రజలకి అండగా నిలబడటంతో ఆయన కొంత మేరకు ఫలితం సాధించారనే చెప్పాలి. ప్రజా వ్యతిరేక విధానాలను ప్రభుత్వం చేపట్టిన ప్రతిసారి ప్రజలకి అండగా నిలుస్తూ... ప్రజలలోకి జనసేన పార్టీ నినాదాన్ని తీసుకువెళ్తున్నారు. ఈ క్రమంలోనే మరో వినూత కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అదే పవనన్న ప్రజాబాట కార్యక్రమం. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్  ని ముఖ్యమంత్రిగా చేసుకోవాలనే లక్ష్యంతో ఈ నెల 17 నుండి నెల్లూరు సిటీ నియోజకవర్గంలో నిరంతరాయంగా ఏడాది పాటు "పవనన్న ప్రజాబాట" పేరుతో ప్రతి ఇంటికి వెళ్ళే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa