జనసేన అధ్యకులు పవన్ కల్యాణ్ తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల 20న పర్యటించనున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలో చౌటుప్పల్, కోదాడల్లో పర్యటనకు ఏర్పాట్లు మొదలయ్యాయి. ప్రమాదంలో మృతి చెందిన పార్టీ క్రియాశీలక సభ్యుల కుటుంబాలను పరామర్శిస్తారు. రూ.5 లక్షల ఆర్ధిక సాయం చెక్కులు అందచేస్తారు. 20వ తేదీ ఉదయం 10గం.కు పవన్ కల్యాణ్ హైదరాబాద్ లో బయలుదేరతారు. మెట్టుగూడ అంబేడ్కర్ చౌరస్తా, ఎల్బీ నగర్ మీదుగా చౌటుప్పల్ సమీపంలోని లక్కారం గ్రామం వెళ్తారు. అక్కడ శ్రీ కొంగర సైదులు కుటుంబాన్ని పరామర్శిస్తారు. ఆ తరవాత కోదాడ వెళ్తారు. అక్కడ శ్రీ కడియం శ్రీనివాసరావు కుటుంబాన్ని పరామర్శిస్తారు. జనసేన పార్టీ తెలంగాణ విభాగం ఈ పర్యటనకు సంబంధించి ఏర్పాట్లను ప్రారంభించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa