ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి దావోస్ పర్యటనపై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు తీవ్ర ఆరోపణలు చేశారు. ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ దావోస్ పర్యటన రాష్ట్రం కోసమా లేక ఆయన తన సోంత పని కోసమా అని ప్రశ్నించారు. సిఎం జగన్ లండన్ ల్యాండింగ్ మిస్టరీ ఏమిటి..? దండుకున్న అవినీతి సంపద దాచుకోడానికేనా? అనే ప్రజల్లో అనుమానాలు నివృతి చేయాలి అని యనమల రామకృష్ణుడు ప్రశ్నించారు. సీఎం జగన్మోహన్ రెడ్డి లండన్ ల్యాండింగ్ వెనుక మిస్టరీ ఏమిటి..? 3ఏళ్ల తర్వాత దావోస్ వెళ్లడం రాష్ట్రం కోసమా, తన కోసమా..? అక్రమార్జన నల్లధనం తరలింపు కోసమా..? దండుకున్న సంపద దాచుకోడానికే లండన్ లో ల్యాండింగా అనే అనుమానం ప్రజల్లో ప్రబలంగా ఉంది అని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa