ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మీ కుతంత్రాలకు ఏపీ ప్రజలు బలి: జీవీఎల్ నరసింహారావు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, May 24, 2022, 07:22 PM

ఏప్రిల్‌, మే నెల‌ల‌కు సంబంధించి ఇప్ప‌టివ‌ర‌కు పీఎం గ‌రీబ్ క‌ల్యాణ్ అన్న యోజ‌న కింద ఉచిత బియ్యం ఇవ్వ‌కుండా వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం వ‌హిస్తోంద‌ని బీజేపీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు ఆరోపించారు. త‌మ త‌ప్పును క‌ప్పిపుచ్చుకునేందుకు ఈ బియ్యానికి సంబంధించిన నిధుల‌ను కేంద్రం ఇంకా విడుద‌ల చేయ‌లేద‌ని ప్ర‌జ‌ల‌ను త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్నార‌ని ఆయ‌న వైసీపీ ప్ర‌భుత్వ పెద్ద‌ల‌పై అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. వైసీపీ ర‌చిస్తున్న రాజ‌కీయ కుతంత్రాల వ‌ల్ల ఏపీలోని 2.68 కోట్ల మంది ప్ర‌జ‌లు ఇబ్బందులు ప‌డుతున్నార‌ని ఆయ‌న ఆవేద‌న వ్యక్తం చేశారు. ఈ మేర‌కు ఆయ‌న ట్విట్ట‌ర్ వేదిక‌గా వైసీపీపై విమ‌ర్శ‌లు గుప్పించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa