ఏపీలో వైసీపీ వచ్చాక తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య స్నేహం పెరిగింది. కానీ అనతికాలంలోనే పలు విషయాలలో ఈ రెండు రాష్ట్రాల మధ్య పొరపచ్చలు వచ్చాయి. కానీ ఎన్ని బేధాభిప్రాయాలున్నా అవి సమస్యల వరకే. కానీ తెలుగువాళ్లుగా మనమంతా ఒక్కటేని ఏపీ సీఎం వై.ఎస్.జగన్, తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ తమ ఫోటోలతో చాటిచెప్పారు.
దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో పాల్గొనడానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, తెలంగాణ మంత్రి కేటీఆర్ వెళ్లిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా దావోస్ లో ఆ ఇరువురు నేతలు కలిసి ఫొటోలు దిగారు. చిరునవ్వులు చిందిస్తూ తీసుకున్న ఈ ఫొటోలను మంత్రి కేటీఆర్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ''నా సోదరుడు, ఏపీ సీఎం జగన్ గారిని కలిశాను'' అని కేటీఆర్ పేర్కొన్నారు. ఇరువురు నేతలూ సూటు, బూటు వేసుకుని దావోస్ పర్యటనలో పాల్గొంటున్నారు. పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా పలువురితో చర్చలు జరుపుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa