పుట్టిన బిడ్డలో కదలిక లేకపోవడంతో వైద్యులు ఆ బిడ్డ చనిపోయిందన్నారు. అప్పుడే పుట్టిన శిశువు ప్రాణంతో లేదని చెప్పేసరికి కన్నతల్లిదండ్రులు కుదేలయ్యారు. కానీ పూడ్చేముందు బిడ్డలో కదలికరావడంతో వైద్యుల ఉదాసీన వైఖరి బయటపడింది.
ఇదిలావుంటే పుట్టిన బిడ్డలో కదలిక లేకపోవడంతో చనిపోయిందన్నారు డాక్టర్లు, బాధతో అంతిమ సంస్కారానికి తీసుకెళ్లారు. మట్టిలో కప్పి పెట్టడానికి (సమాధి) ముందు శిశువు కదలడం చూసి అక్కడున్న వారు ఆశ్చర్యపోయారు. ఇదంతా ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యమే అని భావించి నేరుగా దవాఖానాకు వెళ్లి ఆందోళనకు దిగారు. జమ్మూ కశ్మీర్లోని రంబాన్ జిల్లా బనిహల్ ఉప జిల్లా ఆసుపత్రిలో ఇది చోటు చేసుకుంది.
బంకూట్ నివాసి అయిన బషరత్ అహ్మద్ భార్య ఆసుపత్రిలో శిశువుకు జన్మనిచ్చింది. కానీ, సిబ్బంది శిశువులో ప్రాణం లేదని చెప్పారు. దీంతో బేబీని శ్మశాన వాటికకు తీసుకెళ్లారు. అయితే, పూడ్చిపెట్టేముందు శిశువులో కదలికలను గమనించిన ఒకరు మిగిలిన వారికి చెప్పడంతో.. వారు వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లారు. దీంతో అక్కడి సిబ్బంది ప్రత్యేక చికిత్స కోసం శ్రీనగర్ ఆసుపత్రికి రిఫర్ చేశారు. ఈ ఘటన విషయంలో ఆసుపత్రి నర్స్, స్వీపింగ్ కార్మికురాలిని సస్పెండ్ చేస్తూ ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నారు. పోలీసులు తగిన చర్యలు తీసుకుంటామని బాధిత కుటుంబానికి హామీ ఇచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa