ట్రెండింగ్
Epaper    English    தமிழ்

1000 క్వింటాళ్ల వేరుశనగ విత్తనాలు మంజూరు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, May 27, 2022, 01:53 PM

వెల్దుర్తి మండలానికి 1000 వేరుశెనగ సబ్సిడీ విత్తనాలు మంజూరైనట్లు మండల వ్యవసాయ అధికారి అక్బర్ బాషా పేర్కొన్నారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆయన మాట్లాడుతూ. క్వింటా వేరుశెనగ రూ. 8580 వుండగా రైతులకు 40 శాతం సబ్సిడీతో రూ. 5148 కి ఇవ్వనున్నట్లు తెలిపారు. ఇప్పటికే ఆయా గ్రామాల్లోని రైతు భరోసా కేంద్రాలకు సబ్సిడీ వేరుశనగ విత్తనాలను కేటాయించడం జరిగిందని అన్నారు. రైతులు తమ గ్రామంలోని రైతు భరోసా కేంద్రాల్లో సబ్సిడీ విత్తనాల కోసం రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని సూచించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa