ట్రెండింగ్
Epaper    English    தமிழ்

న్యాయభేరిని విజయవంతం చేయాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, May 28, 2022, 09:36 AM

విజయవాడ బెంజి సర్కిల్ వద్ద శనివారం జరగనున్న సామాజిక న్యాయ భేరి బహిరంగ సభను విజయవంతం చేయాలని పెనమలూరు నియోజకవర్గం శాసనసభ్యులు కొలుసు పార్ధసారధి పిలుపునిచ్చారు. శనివారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌ రెడ్డి అధికారం చేపట్టాక రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు సామాజిక న్యాయం చేశారన్నారు. చం ద్రబాబు అధికారంలో ఉండగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు తీరని అన్యాయం చేశారన్నారు.


బీసీల ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారన్నారు. సీఎం వైఎస్ జగన్ బీసీల్లోని 139 కులాలకు 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి చైర్మన్లు, డైరెక్టర్లను నియమించార న్నారు. ఎస్సీల్లో మూడు కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన ఘనత వైఎస్ జగన్‌కే దక్కుతుంద న్నారు. రాష్ట్ర ప్రజలకు సంక్షేమ పథకాల ద్వారా రూ. 1. 37 లక్షల కోట్లు ఆర్థిక సహాయం అందిం చారన్నారు. అమలాపురంలో జరిగిన దాడిని ఖండించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa