ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పెంచిన నిత్యావసర ధరలు తగ్గించాలని యుటిఎఫ్ ఆధ్వర్యంలో నిరసన

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, May 29, 2022, 08:24 AM

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెంచిన నిత్యావసర వస్తువుల ధరలను తగ్గించాలని యుటిఎఫ్ సూర్యాపేట జిల్లా ఉపాధ్యక్షులు పి శ్రీనివాస్ రెడ్డి జిల్లా కార్యదర్శి ఎం నాగేశ్వరరావు లు ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. శనివారం టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కోదాడ డివిజన్ యుటిఎఫ్ శాఖ ఆధ్వర్యంలో బాలుర ఉన్నత పాఠశాల వద్దనుండి మున్సిపల్ కార్యాలయం వరకు నిర్వహించిన నిరసన ర్యాలీ లో వారు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. పెరిగిన నిత్యావసరాల ధరలతో సామాన్య ప్రజానీకం అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. గ్యాస్ పెట్రోలు డీజిల్ ధరల పెరుగుదలతో అనుబంధ వస్తువుల ధరలు పెరిగాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం కార్మిక రైతు ఉద్యోగ వ్యతిరేక విధానాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అధ్యయనం , అధ్యాపనం సామాజిక స్పృహ లక్ష్యాల్లో భాగంగా టీఎస్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ సామాజిక అంశాలపై పోరాతాలు నిర్వహిస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో నడిగూడెం, మునగాల అనంతగిరి, కోదాడ, మేళ్లచెరువు చింతలపాలెం మండలాల బాధ్యులు మొతి లాల్, వై లక్ష్మీ నారాయణ, మండవ ఉపేందర్, ఆంజనేయులు, పిచ్చయ్య, మాతంగి శ్రీనివాస్, షేఖ్ దస్తగిరి, జాని, సుధాకర్, హర్ష, బాబు, సీనియర్ నాయకులు పాండు రంగా చారి, హమీద్, దొరనిస్, నందా, నర్సీ రెడ్డి , శౌరీ, కిషోర్, తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa