టీడీపీ నాయకురాలు దివ్యవాణి తన రాజీనామా విషయంలో ట్విస్ట్ ఇచ్చారు. తొలుత రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన ఆమె ఆపై అది పొరపాటుగా జరిగిందని, తాను టీడీపీలోనే కొనసాగుతానని స్పష్టంచేసింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ టీడీపీలో దివ్యవాణి ఎపిసోడ్ హాట్ టాపిక్ అయ్యింది. పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ట్విట్టర్ వేదికగా ప్రకటించిన ఆమె.. కొద్ది సేపట్లో ట్వీట్ డిలీట్ చేసి ట్విస్ట్ ఇచ్చారు. తాను టీడీపీలోనే కొనసాగుతానని దివ్యవాణి క్లారిటీ ఇచ్చారు. పార్టీని వీడేది లేదంటున్నారు. తన రాజీనామా వార్తల్లో నిజం లేదంటున్నారు దీనిపై మీడియాకు ఓ వివరణ కూడా ఇచ్చారు. సోషల్ మీడియాలో ఓ వ్యక్తి దివ్యవాణిని టీడీపీ నుంచి సస్పెండ్ చేసినట్లు ఓ ప్రెస్ నోట్ను వైరల్ చేశారు. ఇది చూసి నిజమనుకుని పార్టీకి రాజీనామా ప్రకటించానని ఆమె చెబుతున్నారట. పార్టీ క్రమశిక్షణా సంఘం ఛైర్మన్ బచ్చుల అర్జునుడుతో మాట్లాడిన తర్వాత ట్వీట్ డిలీట్ చేశారట. పార్టీలో తాను ఎదుర్కొంటున్న ఇబ్బందులను చంద్రబాబు, లోకేష్ దృష్టికి తీసుకెళ్తానంటోన్నారు. ఏవైనా సమస్యలు ఉంటే అధినేత చంద్రబాబుతో చర్చిస్తానని అంటున్నారు.
దివ్యవాణి 2019 ఎన్నికలకు ముందు టీడీపీలో చేరారు. అతి తక్కువ కాలంలోనే టీడీపీలో ఫైర్ బ్రాండ్ నాయకురాలిగా గుర్తింపు తెచ్చుకున్నారు. పార్టీలో కూడా అధికార ప్రతినిధి హోదాలో యాక్టివ్గా ఉంటున్నారు. ఉన్నట్టుండి ట్విట్టర్ వేదికగా పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. టీడీపీ అధిష్టానం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆమె ఓ యూట్యూబ్ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూ వీడియో కూడా వైరల్ అయ్యింది.
ట్విట్టర్లో రాజీనామా చేస్తున్నట్లు ప్రకటిస్తూ.. తెలుగు దేశంలోని కొన్ని దుష్ట శక్తుల ప్రమేయన్ని వ్యతిరేకిస్తూ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు తనను ఆదరించిన ప్రతి ఒక్క తెలుగుదేశం కార్యకర్తకు ధన్యవాదాలు తెలిపారు. కానీ కొద్దిసేపటికే ట్వీట్ డిలీట్ చేసిన ఆమె.. పార్టీలోనే కొనసాగుతాను అంటున్నారు. మొత్తానికి దివ్యవాణి ఎపిసోడ్ టీడీపీ టీ కప్పులో తుఫాన్లా మారింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa