బంగారు గనుల్లో కార్మికుల మధ్య గ్యాంగ్ వార్ జరిగింది. ఆఫ్రికా దేశంలో జరిగిన అల్లర్లలో వంది మంది చనిపోయారు. ఉత్తరచాద్లో మే 23,24 తేదీల్లో బంగారు గని కార్మికుల మధ్య ఘర్షణలు జరిగాయి. అందులో వందమంది ప్రాణాలు కోల్పోయారని ఆ దేశ రక్షణ మంత్రి దావూద్ యాయా బ్రాహిమ్ సోమవారం తెలిపారు. లిబియా సరిహద్దుకు సమీపంలోని పర్వత ప్రాంతాలైన కౌరీ బౌగౌడి జిల్లాలో ఒక అనధికారిక బంగారు గనుల ప్రదేశంలో రాత్రి సమయంలో హింస చెలరేగింది. ఈ గొడవలో చాలామందికి గాయాలు కూడా అయ్యాయి.
అయితే అక్కడ జరిగిన గొడవను ఆపడానికి, అశాంతిని తొలగించడానికి స్థానిక అధికారులు ఆ ప్రాంతాన్ని సందర్శించారు. మే 25న నిజ నిర్థారణ కమిటీని పంపించింది. అయితే అప్పటికే చాలామంది చనిపోయినట్టు, ఇంకెంతో మంది గాయపడినట్టు అధికారులు గుర్తించారు. జరిగిన గొడవల్లో వందమంది చనిపోయినట్టు వెల్లడించారు. అనంతరం అనధికారిక మైనింగ్ కార్యకలాపాలను నిలిపివేశారు. ఘర్షణలు జరిగిన ప్రాంతం నుంచి ప్రజలను ఖాళీ చేయించే పనిని చేపట్టారు.
అయితే అక్కడ మౌరిటానియన్లు, లిబియన్ల మధ్య ఘర్షణలు జరిగాయి. ఈ ఘటన బుధవారం మొదటిసారిగా బయటకు వచ్చింది. జరిగి ఘర్షణల్లో చాలా ప్రాణ నష్టం జరిగిందని, అనేక మంది గాయపడ్డారని ప్రభుత్వం ఒక ప్రటకనలో తెలియజేసింది. అయితే అక్కడ ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం ఇదే మొదటిసారి కాదు. బంగారం వెలికితీత పనులకు సంబంధించి చాద్, అక్కడి పొరుగు ప్రాంతాల మైనర్ల మధ్య తరచుగా ఉద్రిక్తతలు తలెత్తుంటాయి. గతంలో కూడా చాలామంది ఇలాంటి ఘర్షణల్లో చాలామంది చనిపోయినట్టు తెలుస్తుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa