ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇకేవైసీ గడువు పొండగింపు..అన్నదాతలకు కేంద్ర ఊరాట

national |  Suryaa Desk  | Published : Sun, Jun 05, 2022, 03:06 PM

దేశంలోని రైతులకు ఊరాట కలిగించేలా  కేంద్రంలోని బీజేపీ  సర్కార్ తాజాగా ఓ కీలక నిర్ణయం తీసుకొంది. ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకంలో చేరిన అన్నదాతలకు తీపికబురు అందించింది. ఇకేవైసీ గడువును పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. మరో రెండు నెలల పాటు డెడ్‌లైన్‌ ఎక్స్‌టెండ్ చేసింది. సాధారణంగా ఇకేవైసీ గడువు మే 31తో ముగియాల్సి ఉంది. అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఈ గడువును 2022 జూలై 31 వరకు పొడిగించింది.


పీఎం కిసాన్ వెబ్‌సైట్ ప్రకారం.. పీఎం కిసాన్ స్కీమ్ కింద లబ్ధి పొందుతున్న వారందరికి ఇకేవైసీ డెడ్‌లైన్‌ను జూలై 31 వరకు పొడిగించారు. కేంద్ర ప్రభుత్వం గడువును పొడిగించడం ఇది రెండో సారి కావడం గమనార్హం. సాధారణంగా పీఎం కిసాన్ స్కీమ్ ఇకేవైసీ గడువు మార్చి 31తోనే ముగియాల్సి ఉంది. దీన్ని మే 31 వరకు ఎక్స్‌టెండ్ చేశారు. ఇప్పుడు ఈ గడువు జూలై 31 వరకు పొడిగించారు.


ప్రధాన్ మంత్రి కిసాన్ స్కీమ్ అర్హత కలిగిన రైతులకు ఏటా రూ. 6 వేలు లభిస్తున్నాయి. ఈ డబ్బులు ఒకేసారి కాకుండా మూడు విడతల్లో వస్తున్నాయి. 4 నెలలకు రూ. 2 వేల చొప్పున లభిస్తాయి. ఇప్పటి వరకు 11 విడతల డబ్బులు వచ్చాయి. అంటే ఈ స్కీమ్ కింద ఒక్కో రైతులకు రూ. 22 వేలు అందాయి. మరోవైపు ఏపీ ప్రభుత్వం కూడా రైతులకు రైతు భరోసా కింద డబ్బులు అందిస్తున్న విషయం తెలిసిందే.


ఇకేవైసీ ఎలా పూర్తి చేసుకోవాలి?


ఇకేవైసీ పూర్తి చేసుకోవాలని భావించే రైతులు ఆన్‌లైన్‌లోనే ఆ పని పూర్తి చేసుకోవచ్చు. దీని కోసం పీఎం కిసాన్ వెబ్‌సైట్‌కు వెళ్లాలి.


అక్కడ కుడి భాగంలో ఇకేవైసీ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దీనిపై క్లిక్ చేయాలి.


ఇప్పుడు కొత్త పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు మీ ఆధార్ నెంబర్‌ను ఎంటర్ చేయాలి. అలాగే క్యాప్చా కోడ్ ఎంటర్ చేయాలి. తర్వాత సెర్చ్‌పై క్లిక్ చేయాలి.


ఇప్పుడు ఆధార్ కార్డుతో లింక్ అయిన మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. గెట్ ఓటీపీపై క్లిక్ చేయాలి. మీ ఫోన్‌కు ఓటీపీ వస్తుంది. దీన్ని ఎంటర్ చేయాలి. సబ్‌మిట్ చేయాలి.


మీరు ఎంటర్ చేసిన అన్ని వివరాలు కరెక్ట్ అయితే.. మీ ఇకేవైసీ ప్రక్రియ విజయవంతం అవుతుంది. లేదంటే ఇన్‌వాలిడ్ అని వస్తుంది. లేదంటే కామన్ సర్వీస్ సెంటర్‌కు వెళ్లి ఈ పని పూర్తి చేసుకోవచ్చు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa