ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కాలం మారుతున్న మారని ఆలోచన తీరు...ఆడపిల్ల పుట్టిందని అలా

national |  Suryaa Desk  | Published : Sun, Jun 05, 2022, 03:18 PM

కాలం మారుతున్న ఇంకా అత్తా, మామ, భర్త తీరు మారడంలేదు. పుట్టబోయే  బిడ్డ ముగబిడ్డనా...అడ్డబిడ్డనా అన్నది భార్యకు సంబంధంలేకపోయినా మహిళే నాటి నుంచి ధారుణాలను ఎదుర్కొంటోంది. ఉత్తరప్రదేశ్ లోని ఇలాంటి ధారుణ ఘటన గురించి వింటే మనవత్వం చనిపోయిందా అనిపిస్తుంది. ఉత్తరప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. మహోబా జిల్లాలో ఇద్దరు ఆడపిల్లలకు జన్మనిచ్చినందుకు ఓ మహిళను ఆమె భర్త, అతని కుటుంబ సభ్యులు దారుణంగా హింసించారు. అందరూ చూస్తుండగానే ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. రాంనగర్ జుఖా ప్రాంతానికి చెందిన ఒక మహిళ ఇటీవల రెండో కాన్పూలోనూ ఆడపిల్లలకు జన్మనిచ్చింది. అదే ఆమె చేసిన పెద్ద నేరం అయింది.


మగబిడ్డ పుట్టలేదనే కారణంతో ఆమెను తీవ్రంగా వేధించారు. కొన్నిసార్లు తిండి కూడా పెట్టలేదని బాధితురాలు వాపోయింది. తనకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారని మగబిడ్డ కావాలంటూ భర్త, అత్తమామలు తనను హింసిస్తున్నారని చెప్పింది. తనకు తిండి పెట్టకపోవడంతో కూలి పనికి వెళ్తుంది.రెండో కూతురు పుట్టిన తర్వాత వేధింపులు ఎక్కువయ్యాయని మహిళ చెప్పింది.


ఈ క్రమంలో అత్తింటి కుటుంబానికి చెందిన ఇద్దరు మహిళలు ఆమె పట్ల అమానుషంగా ప్రవర్తించారు. ఆమెను దారుణంగా కొట్టారు. కింద పడేసి కాళ్లతో తన్నారు. అక్కడున్న స్థానికులు కళ్లప్పగించి చూశారే కానీ ఎవరూ కూడా ఆమెను కాపాడేందుకు ముందుకు రాలేదు. అయితే ఈ ఘటనకు సంబంధించిన వీడియో బయటకొచ్చింది. అందులో ఇద్దరు మహిళలు ఆ మహిళను దుర్భాషలాడడం, తన్నడం, కొట్టడం వంటివి చూడొచ్చు. ఆమె ఏడుస్తూ వారిని వేడుకుంటున్నా.. వారు కొట్టడం ఆపడం లేదు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. ఆ మహిళను చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేర్చారు. నిందితులపై తగిన చర్యలు తీసుకుంటామని మహోబా పోలీసు సూపరింటెండెంట్ సుధా సింగ్ చెప్పారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa