నిరసనను వివిధ రూపాల్లో వ్యక్తంచేస్తుంటాం. కానీ తన ఇంటికి విద్యుత్ సరఫరాలోపం సరిచేయని విద్యుత్ అధికార్లపై ఓ వ్యక్తి తనదైన శైలీలో నిరసన తెలుపుతున్నాడు. గంటల తరబడి కరెంట్ పోవడం మన దేశంలో కొత్తేమి కాదు. అయితే గ్రామాల్లో ఈ సమస్య మరింత తీవ్రంగా ఉంటుంది. కొన్ని రాష్ట్రాల్లో అయితే గంటలు, గంటలు విద్యుత్ ఉండడం లేదు. దాంతో చాలా కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయి. అయితే ఈ సమస్యను ఓ వ్యక్తి మాత్రం తాళలేకపోయాడు. దాంతో విద్యుత్ అధికారులపై వినూత్నంగా నిరసన తెలియజేయడం మొదలుపెట్టాడు.
దానికోసం ప్రతిరోజూ కర్ణాటకలోని శివమొగ్గకు జిల్లాలోని మంగోటే గ్రామానికి చెందిన హనుమంతప్ప స్థానిక విద్యుత్ కార్యాలయానికి వెళ్తున్నాడు. ఆ కార్యాలయంలోనే మిక్సీ వేస్తుంటాడు. తన రెండు సెల్ఫోన్లకు ఛార్జింగ్ కూడా పెట్టుకుంటాడు. పగటిపూట కరెంట్కు సంబంధించిన అన్ని పనులు అక్కడే చేస్తాడు. అయితే దీనిపై అధికారులెవరూ అభ్యంతరం చెప్పకపోవడం విశేషం.
పది నెలల క్రితం హనుమంతప్ప తన ఇంటికి కరెంట్ సరిగ్గా ఉండడం లేదని ఫిర్యాదు చేశాడు. కానీ అధికారులు పట్టించుకోలేదు. దాంతో ఈ తంతు మొదలైంది. నిజానికి హనుమంతప్ప ఇంటికి కేవలం రోజుకు మూడు, నాలుగు గంటలు మాత్రమే కరెంట్ ఉంటుంది. దీనిపై ఆయన చాలా ఫైట్ చేశాడు. విద్యుత్ అధికారులకు ఫిర్యాదు చేశాడు. నెలల తరబడి ఆఫీసుల చుట్టూ తిరిగాడు. కానీ అతని కుటుంబానికి కరెంట్ సమస్య మాత్రం తీరలేదు.
దాంతో విసిగిపోయిన హనుమంతప్ప తనకు ఎదురైన సమస్య గురించి మెస్కామ్ సీనియర్ అధికారికి ఫోన్ చేసి చెప్పాడు. కరెంట్ లేకపోవడంతో కనీస పనులు చేసుకోలేకపోతున్నామని చెప్పాడు. దాంతో ఆవేశానికి లోనైన సదరు ఉన్నతాధికారి మెస్కామ్ కార్యాలయంలోనే ఇలా చేయొచ్చని చెప్పారు. దీని తర్వాత హనుమంతప్ప ప్రతిరోజూ ఈ సలహాను పాటిస్తున్నాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa