ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బొత్సకు తన వైన్ షాపుల సంఖ్య తప్ప.. రాష్ట్రంలో‎ పాఠశాలల సంఖ్య తెలీదు: అచ్చెన్నాయుడు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Jun 05, 2022, 03:20 PM

రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణకు తన వైన్ షాపుల సంఖ్య తప్ప.. రాష్ట్రంలో‎ పాఠశాలల సంఖ్య తెలుసా అని తెలుగు దేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుతీవ్ర వ్యాఖ్యలు చేశారు. 10వ తరగతి పరీక్ష ఫలితాలు వస్తాయని 6 లక్షల మంది విద్యార్థులు ఎంతో ఆశతో ఎదురు చూశారన్నారు. అయితే, ఫలితాలను ఎందుకు వాయిదా వేశారో విద్యార్థులకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.


ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసమర్థ పాలనలో విద్యారంగం భ్రష్టుపట్టిందని ఆయన తీవ్ర స్థాయిలో విమర్శించారు. అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడుతూ.. కోర్టు వాయిదాలకు అలవాటు పడి పడి.. పరీక్ష ఫలితాలు వాయిదా వేస్తే ఎలా జగన్ అంటూ ఆయన వ్యంగ్యాస్త్రాలు సంధించారు.


ముందు పరీక్ష ఫలితాలు విడుదల చేస్తామని చెప్పి, చివరి నిమిషంలో వాయిదా వేయటం ఏంటని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. పరీక్ష ఫలితాల వాయిదా అధికారులు, మంత్రి మధ్య సమన్వయ లోపమా? లేక జగన్ ప్రభుత్వ చేతకానితనమా అని దుయ్యబట్టారు. విద్యార్థులకు, వారి తల్లితండ్రులకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అసమర్థ పాలనతో విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతారా అని నిలదీశారు. మద్యం వ్యాపారం చేసుకునే వ్యక్తిని.. విద్యా శాఖ మంత్రిగా ఇలాగే ఉంటుందని బొత్స సత్యనారాయణపై అచ్చెన్న తీవ్ర వ్యాఖ్యలు చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa