ఆంధ్రప్రదేశ్ లో పదో తరగతి పరీక్షా ఫలితాలను వాయిదా వేయడంపై మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఫైర్ అయ్యారు. పదో తరగతి పరీక్షల ఫలితాల ప్రకటనలో ఆలస్యం, అయోమయం - ఎందుకింత గందరగోళం - నిర్ణీత సమయానికి ఫలితాలు ప్రకటిస్తామని వాయిదా వేయడం అంటే చేతకానితనమే - అధికారులు ఎందుకు ఇంత అచేతనంగా మారుతున్నారు అని అన్నారు. కనీసం ప్రభుత్వ ప్రతిష్ట కు సంబందించిన ఇలాంటి పరీక్షా ఫలితాల విడుదలనూ సకాలంలో చేయలేకపోతే ఇక మీపై భరోసా ఎలా ఉంటుంది? కనీసం మీకు మీరు సమర్థించుకో గలరా? అని శ్రీనివాసరావు అన్నారు. గతంలో పరీక్షల నిర్వహణ తో పాటు ఫలితాల తేదీ ని కూడా అకడమిక్ క్యాలెండర్ లోనే పొందుపరిచే వాళ్ళం? కచ్చితంగా అమలుచేసే వాళ్ళం. ఇప్పుడెందుకు అలా చేయలేకపోతున్నారు? వివరించగలరా అని గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa