ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జల్లయ్య కుటుంబానికి 25లక్షల అర్థిక సహయం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jun 06, 2022, 01:25 PM

పల్నాడు జిల్లా, మాచర్ల నియోజకవర్గ పరిధిలో , దుర్గి సమీపంలో జరిగిన పార్టీల ఘర్షణలో టీడీపీ కార్యకర్త జాలయ్య మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ విషయంపై టీడీపీ నాయకులూ నిరసనలు కూడా చేసారు. ఈ కేసుకి సంబంధించి 9 మంది నిందితులని అదుపులోకి తీసుకున్నట్లు పోలీస్ వారు తెలియజేసారు. ఈ నేపథ్యంలో ప్రత్యర్థుల చేతిలో హత్యకు గురైన టిడిపి కార్యకర్త జల్లయ్య గారి కుటుంబసభ్యులను చిలకలూరిపేట టీడీపీ నాయకులూ , మాజీ మంత్రి  ప్రత్తిపాటి పుల్లారావు  పరామర్శించడం జరిగింది. ఈ నెల 17న నారా లోకేష్  చేతుల మీదుగా జల్లయ్య కుటుంబానికి 25లక్షల అర్థిక సహయం, ముగ్గురు పిల్లలను యన్.టి.ఆర్ ట్రస్టు ద్వారా చదివిస్తామని భరోసాఇవ్వడం జరిగింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa