రాష్ట్రాల్లో కొవిడ్ నిబంధనలు సరిగా పాటించకపోవడం, బూస్టర్ డోసులు తీసుకోకపోవడం కేసులు పెరగడానికి కారణమని వైద్య నిపుణులు భావిస్తున్నారు. కేసులు పెరుగుతున్నప్పటికీ.. ఆస్పత్రిలో చేరికలు, మరణాల్లో మాత్రం ఎలాంటి పెరుగుదల లేదన్నారు ఎయిమ్స్ డైరెక్టర్ రణ్దీప్ గులేరియా. కేసులు పెరగటం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. దేశ్యాప్తంగా కొవిడ్ నిబంధనలను పాటించడంతో పాటు కొత్త వేరియంట్లను గుర్తించేందుకు వీలుగా భారీగా పరీక్షలు చేయించడంపై ఫోకస్ పెట్టాలంటున్నారు. కొవిడ్ నిబంధనల విషయంలో అలసత్వం వద్దని హెచ్చరిస్తున్నారు. ప్రజలు బూస్టర్ డోసు వేసుకోవాలి అన్నారు. కరోనా ఇంకా పూర్తిగా తొలగిపోలేదని ఐసీఎంఆర్ ప్రతినిధి డాక్టర్ నివేదిత గుప్తా అంటున్నారు. ప్రికాషన్ డోసు వేసుకోవాలని.. ప్రస్తుతం పెరుగుతున్న కేసుల్ని సమర్థంగా కట్టడి చేసేందుకు తగిన చర్యలు అవసరమని చెబుతున్నారు.
దేశవ్యాప్తంగా కరోనా మరోసారి పంజా విసురుతోంది. కొత్తగా నమోదవుతున్న కేసుల సంఖ్య 8వేలకు పైగా ఉంటోంది. వరుసగా రెండో రోజు కూడా 8,582 మందికి పాజిటివ్గా తేలింది. మొత్తం కేసుల సంఖ్య 4,32,22,017కు చేరగా.. క్రియాశీలక కేసుల సంఖ్య 44,513కు చేరిందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఈ మమహ్మారి నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,435 మంది. మరోవైపు కరోనాతో నలుగురు కన్నుమూయగా.. మొత్తం మరణాల సంఖ్య 5,24,761కి చేరింది. ఇక కేసుల్లో క్రియాశీలక కేసులు 0.10కాగా.. రోజువారీ పాజిటివిటీ రేటు 2.71 శాతానికి చేరింది. అలాగే రికవరీ రేటు 98.68 శాతానికి పడిపోగా.. ఇప్పటివరకూ 194.9 కోట్లకు పైగా వ్యాక్సిన్ డోసులు ఇచ్చారు.
ముఖ్యంగా మహారాష్ట్ర, ఢిల్లీ, కేరళలో కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. ప్రస్తుతం యాక్టివ్ కేసుల గ్రాఫ్ పైకి ఎగబాకుతోంది. ఈ కొత్త కేసులు పెరుగుతున్నా ఎలాంటి భయాందోళనలు అవసరం లేదంటున్నారు వైద్యరంగ నిపుణులు. దేశంలో కొత్త వేరియంట్లేవీ లేవని.. కేసుల పెరుగుదల కూడా కేవలం కొన్ని జిల్లాలకు మాత్రమే పరిమితమైంది అంటున్నారు. రాష్ట్రాల్లో కొవిడ్ నిబంధనలు సరిగా పాటించకపోవడం, బూస్టర్ డోసులు తీసుకోకపోవడం కేసులు పెరగడానికి కారణమని భావిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa