ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తీరు మారేది ఎపుడు...పోలీస్ స్టేషన్ విడీయోను రిటర్ గిఫ్ట్ గా ప్రకటించిన బీజేపీ ఎమ్మెల్యే

national |  Suryaa Desk  | Published : Sun, Jun 12, 2022, 08:57 PM

పరిధి  దాటకూడదు...రెచ్చగొట్టే ప్రసంగాలు వద్దు అని  ఇటీవల  తన పార్టీ నేతలకు  బీజేపీ అధిష్టానం హితబోధ  చేసింది. అంతేకాకుండా టీవీ చర్చల్లో ఫలాన వారు పాల్గొనవద్దని కూడా తేల్చిచెప్పింది. కారణం రెచ్చగొట్టేలా వారు మాట్లాడుతున్నారని. కానీ  తాజాగా ఓ పోస్ట్  మళ్లీ వివాదాస్పదమవుతోంది. ఇదిలావుంటే మహ్మద్ ప్రవక్తపై బీజేపీ మాజీ నాయకుడు నూపుర్ శర్మ, నవీన్ జిందాల్ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా దేశంలో చాలా రాష్ట్రాల్లో నిరసనలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో యూపీకి చెందిన బీజేపీ ఎమ్మెల్యే రిటర్న్ గిఫ్ట్ అంటూ ఒక వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇప్పుడు ఆ వీడియో వైరల్ అయింది. అందులో పోలీసులు దాదాపు పది మందిని కర్రలతో కొట్టడాన్ని చూడొచ్చు. ఈ వీడియోను రెండురోజుల క్రితం శరన్ పూర్‌లోని పోలీస్ స్టేషన్‌లో తీసినట్టు తెలుస్తుంది. శుక్రవారం ప్రార్థనల తర్వాత హింసాత్మక ఘర్షణలు జరిగిన ఉత్తరప్రదేశ్‌లోని శరన్‌పూర్‌లోని వీడియో.


ఈ వీడియోను బీజేపీ ఎమ్మెల్యే శలభ్ మణి త్రిపాఠి ట్విట్టర్‌లో పంచుకున్నారు. "అల్లర్లకు రిటర్న్ గిఫ్ట్" అని క్యాప్షన్ కూడా పెట్టారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌ అయింది. ఈ వీడియోను చూసిన కొందరు పోలీసుల క్రూరత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ దీనిపై స్పందించారు. ఇలాంటి సంఘటనలు న్యాయ వ్యవస్థపై ప్రజలకు ఉన్న విశ్వాసాన్ని దెబ్బతీస్తుంటాయని అన్నారు. అంతేకాదు ఇలాంటి పోలీస్ స్టేషన్ల గురించి ప్రశ్నించాలని, కస్టడీ మరణాల్లో యూపీ ఒకటో స్థానంలో ఉందని, మానవ హక్కుల ఉల్లంఘనలు, దళితులపై వేధింపుల్లో అగ్రగామిగా ఉందని ఆయన గుర్తు చేశారు.


ఇక ఎమ్మెల్యే శలభ్ మణి త్రిపాఠి మాజీ జర్నలిస్ట్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు మీడియా సలహాదారుగా ఉండేవారు. కాగా శుక్రవారం నాటి నిరసనలు, హింసకు సంబంధించిన యూపీ పోలీసులు రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి 300 మందికి పైగా అరెస్టు చేశారు. సహరాన్‌పూర్‌, ప్రయాగ్ రాజ్‌లో కఠినమైన జాతీయ భద్రతా చట్టం కింద అరెస్ట్ చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని పోలీసు అధికారులు తెలిపారు. అరెస్టైన వారిలో 91 మంది ప్రయాగ్‌రాజ్‌లో, 71 మంది సహరాన్‌పూర్‌లో, 51 మంది హత్రాస్‌లో ఉన్నట్టు పోలీసులు తెలిపారు. ఈ మేరకు శాంతియుత వాతావరణాన్ని చెడగొట్టడానికి ప్రయత్నించే వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ హెచ్చరించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa