ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎటకేలకు పోస్ట్ సాధించిన ఏబీ వెంకటేశ్వరరావు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jun 15, 2022, 08:50 PM

తనకు పోస్టింగ్ ఇవ్వాలని గత కొన్ని నెలలుగా రాష్ట్ర ప్రభుత్వంపై లీగల్ పోరాటం చేసిన ఏపీ కేడ‌ర్ సీనియ‌ర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావుకు ఊరాట లబించింది. సుదీర్ఘ విరామం త‌ర్వాత ఏపీ ప్ర‌భుత్వం ఆయనకు పోస్టింగ్ ఇచ్చింది. త‌న‌ను సస్పెండ్ చేస్తూ ఏపీ ప్ర‌భుత్వం జారీ చేసిన ఉత్త‌ర్వుల‌ను స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం సుప్రీంకోర్టులో స‌వాల్ చేసిన ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావు విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే. సివిల్ స‌ర్వీసెస్ అధికారుల‌ను రెండేళ్ల‌కు మించి స‌స్పెన్ష‌న్‌లో ఉంచ‌రాద‌న్న నిబంధ‌న‌ను ప్ర‌స్తావించిన సుప్రీంకోర్టు త‌క్ష‌ణ‌మే ఏబీవీకి పోస్టింగ్ ఇవ్వాలంటూ ఇటీవ‌లే ఆదేశాలు జారీ చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేర‌కే ఏపీ ప్ర‌భుత్వం తాజాగా ఏబీవీకి పోస్టింగ్ ఇస్తూ ఉత్త‌ర్వులు జారీ చేసింది.


ఇదిలావుంటే రాష్ట్ర ప్రింటింగ్ అండ్ స్టేష‌న‌రీ క‌మిష‌న‌ర్‌గా ఆయ‌న‌ను నియ‌మిస్తూ బుధ‌వారం ఉత్త‌ర్వులు జారీ చేసింది. టీడీపీ హ‌యాంలో ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్‌గా వ్య‌వ‌హ‌రించిన ఏబీవీని నిఘా ప‌రిక‌రాల కొనుగోలులో అక్ర‌మాల‌కు పాల్ప‌డ్దారన్న ఆరోప‌ణ‌ల‌తో వైసీపీ ప్ర‌భుత్వం స‌స్పెండ్ చేసిన సంగ‌తి తెలిసిందే.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa