రాష్ట్రపతి ఎన్నికలతో మరోసారి దేశంలో రాజకీయ వేడి మొదలైంది. ఈ ఎన్నిక ఏకగ్రీవం చేయాలని బీజేపీ భావిస్తుంటే పోటీకి దిగి బీజేపీని నిలువరించే ప్రయత్నం చేయాలని ఎన్డీయేతర పార్టీలు భావిస్తున్నాయి. ఇదిలావుంటే భారత రాష్ట్రపతి ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైన బుధవారమే ఏకంగా ఆ ఎన్నికకు 11 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇలా నోటిఫికేషన్ విడుదలైందో, లేదో అలా రాష్ట్రపతి ఎన్నికకు 11 నామినేషన్లు దాఖలయ్యాయి. రాష్ట్రపతి ఎన్నికలు పార్లమెంటు సహా అన్ని రాష్ట్రాల అసెంబ్లీల్లోనూ పోలింగ్ నిర్వహిస్తున్నా... నామినేషన్ల దాఖలు మాత్రం ఢిల్లీలోని పార్లమెంటులోని లోక్ సభ సెక్రటేరియట్లోనే కొనసాగుతుంది. అంతేకాకుండా ఈ ఎన్నికల్లో పాలుపంచుకునే వారిలో 50 మంది ప్రతిపాదిస్తే తప్పించి నామినేషన్లే వేయడం కుదరదు. అయినా కూడా బుధవారం తొలి రోజే రాష్ట్రపతి ఎన్నికకు 11 నామినేషన్లు దాఖలు కాగా...వాటిలో ఓ నామినేషన్ను రిటర్నింగ్ అధికారి తిరస్కరించారు. ఈ నామినేషన్లు దాఖలు చేసిన వారి వివరాలు తెలియరాలేదు. ఇదిలావుంటే జూలై 23తో ప్రస్తుత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పదవీ కాలం ముగియనుంది. ఈ లోగా కొత్త రాష్ట్రపతిని ఎన్నుకోవాల్సి ఉన్న నేపథ్యంలో రాష్ట్రపతి ఎన్నికలకు బుధవారం కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa