యూపీ పోలీసులు వినూత్నంగా అడుగులేస్తున్నారు. నేరాల అదుపునకు తనదైన శైలీలో అడుగులేస్తున్నారు. మీరు అర్జున్ నటించిన ఒకే ఒక్కడు సినిమా చూసే ఉంటారు. అందులో... అర్జున్ ఒక్కరోజు సీఎం అవ్వగానే.. తప్పు చేసే వారందరికీ వెంట వెంటనే నోటీసులు ఆన్ ది స్పాట్ పంపించేస్తుంటారు. అలా వాళ్లకు చుక్కలు చూపిస్తారు. అలాంటివి మనం రియల్ లైఫ్లో చూడటం అరుదు. ఇంకా ఆ రేంజ్కి మన దేశం ఎదగలేదని మనం భావిస్తాం. కానీ ఉత్తరప్రదేశ్ పోలీసులు దీన్ని నిజం చేసి చూపిస్తున్నారు. సీఎం యోగి ఆదిత్యనాథ్ రెండోసారి అధికారంలోకి వచ్చాక.. పోలీసులకు సూపర్ పవర్స్ ఇచ్చారు. దాంతో అధికారులు తగ్గేదే..లే అంటున్నారు. ఎక్కడ ఎవరు ఎలాంటి స్టంట్ చేసినా... ఫైన్ వేస్తున్నారు. కొంతమందినైతే జైలుకు పంపుతున్నారు.
తాజాగా ముజఫర్నగర్ పోలీసులు... ఓ పెళ్లి బృందం చేసిన స్టంట్పై యాక్షన్ తీసుకున్నారు. రోడ్డుపై వరుడు ఆడి కారులో వెళ్తుండగా... అతని ఫ్రెండ్స్ మరో 8 కారుల్లో వెళ్లారు. వారంతో కార్లపై నిల్చున్నారు. కొందరు కార్ల విండోల్లోంచీ బయటకు వచ్చి సెల్ఫీలు తీసుకున్నారు. డాన్స్ చేశారు. ఇదంతా చట్ట విరుద్ధం. రోడ్లపై ఇలాంటివి చెయ్యడానికి వీలు లేదు. దీని వల్ల ఇతర వాహనదారులకు ఇబ్బందే.
అంకిత్ కుమార్ అనే వ్యక్తి... ఇదంతా వీడియో తీసి.. సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. పోలీసుల్ని అలర్ట్ చేశాడు. "నేను హరిద్వార్ నుంచి నోయిడా వెళ్తుంటే.. కొంతమంది ముజఫర్నగర్ జిల్లాలో... ప్రమాదకర స్టంట్స్ చేస్తూ... ఆనందిస్తున్నారు. ట్రాఫిక్ పోలీసులు ఈ విషయాన్ని లెక్కలోకి తీసుకుంటారని ఆశిస్తున్నాను" అని మెసేజ్ పెట్టాడు. పోలీసులు లెక్కలోకి తీసుకున్నారు. వరుడి కారు సహా... 9 కార్లకు 2లక్షల 2వేల రూపాయల ఫైన్ వేశారు. ఈ కార్లన్నీ ఢిల్లీ రిజిస్ట్రేషన్ ప్లేట్లతో ఉన్నాయి.
చెప్పాలంటే వీళ్లు అదృష్టవంతులే. ఎందుకంటే వీళ్లకు ఛలాన్లు మాత్రమే వేశారు. ఈ మధ్య నోయిడా పోలీసులైతే... ఏకంగా అరెస్టు చేసి.. వాహనాలను సీజ్ చేస్తున్నారు. అంతేకాదు.. స్టంట్ చేసిన వాళ్లనే కాకుండా... దాన్ని వీడియో తీసే ఆ వ్యక్తుల ఫ్రెండ్స్ని కూడా అరెస్టు చేస్తున్నారు. ఈ రేంజ్లో ఉక్కుపాదం మోపుతున్నారు కాబట్టే కొంతవరకూ రోడ్లపై అల్లర్లు తగ్గాయనే వాదన వినిపిస్తోంది.
ఎప్పట్లాగే తాజా చర్యను కూడా నెటిజన్లు స్వాగతిస్తున్నారు. పోలీసులు ఇలాంటి యాక్షన్ తీసుకుంటేనే... రోడ్లపై అడ్డమైన స్టంట్స్ చేయకుండా ఉంటారని అంటున్నారు. "తప్పు చేసేవారికి ఇది సరైన గుణపాఠం. ఇలాంటి వారు రోడ్లపై ఇతర ప్రయాణికులకూ, ప్రజా రవాణాకూ ఇబ్బంది కలిగిస్తూ ఉంటారు. ఇలాంటి చర్యలు తీసుకుంటూనే ఉండండి. మీరు చేయాల్సిన పనిలో సగం ప్రజలు చేస్తూ... మీకు సమాచారం ఇస్తున్నారు. నేరాలను ఆన్లైన్లో పెట్టి మిమ్మల్ని అలర్ట్ చేస్తున్నారు. ఆ నేరాలపై మీరు చర్యలు తీసుకుంటేనే సంపూర్ణం అవుతుంది" అని ఓ యూజర్ స్పందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa